తమిళనాడు గవర్నర్ గా నూతనంగా నియమితుడైన బన్వరీలాల్ పురోహిత్ కు బాధ్యతలు అందుకున్న సమయం కలసివచ్చినట్టు లేదు. ఆయన ఏం చేయబోయినా.. అన్ని ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. ఇటీవలే ఓ మహిళ ఫిర్యాదు చేయడం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఊహించన పరిణామంతో గవర్నర్కు షాక్కు గురయ్యారు. తాను స్నానం చేస్తుండగా గవర్నర్ చూశారని అమె ఏకంగా పోలీసులను అశ్రయించి పిర్యాదు చేసింది. ఇక తాజాగా తన కాన్వాయ్లోని ఓ వాహనం బైక్ ను ఢీ కొనడంతో ఇద్దరు మరణించాన్న వార్తకూడా సత్యదూరమని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశాల అనంతరం.. స్వచ్ భారత్ అభియాన పథకం కింద స్థానికంగా నిర్మించిన బాత్రూమ్ లను పరిశీలించారు. ఇందుకోసం వీధి వీధి తిరుగుతూ పలు ఇళ్లను సందర్శించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలోకి వెళుతూ.. పక్కనున్న బాత్రూంలోకి తొంగిచూశారు. లోపల ఓ మహిళ స్నానం చేస్తుండటంతో.. వెంటనే వెనక్కితిరిగారని దీంతో తన పరువుకు భంగం కలింగిందని అరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. గవర్నర్ పై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ అమె డిమాండ్ చేస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యింది.
గవర్నర్ చర్యను ప్రతిపక్ష డీఎంకే నిరసించింది. అయితే తాను బాత్ రూంలోకి తొంగిచూసి.. ఓ అడపడచు పరువుకు భంగం కలిగించానని వచ్చిన అరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని గవర్నర్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనలో వెలువరించింది. స్వచ్చా భారత్ అభియాన్ నిధులతో నిర్మించిన టాయ్ లెట్లను పరిశీలించేందుకు తాను వెళ్లిన మాట నిజమేనని.. అయితే ఎవరి బాత్ రూంలోకి గవర్నర్ తొంగి చూడలేదని రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి.
ఈ ఉదంతం ఇలా ఉండగానే గవర్నర్ మరో వివాదంలో కూడా ఆయనకు చుట్టుకుంది. గవర్నర్ కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. భద్రతా సిబ్బంది వాహనం అదుపుతప్పి ఓ బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలను కూడా రాజ్ భవన్ వర్గాలు తోసిపుచ్చాయి. తనకు ఎస్కార్టుగా వచ్చిన కాంచీపురం పోలీసు వాహనం న్యూ కల్పక్కం వద్ద ఈస్టుకోస్టు రోడ్డులో అదుపుతప్పిందని, అయితే అప్పటికే తమను ఎస్కార్టు వాహనం వదిలి స్టేషన్ కు చేరుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more