pawan kalyan agian questions on ap special status issue ఏపీ స్పెషల్ స్టేటస్ అంశంపై మళ్లీ గర్జించిన పవన్

Pawan kalyan agian questions on ap special status issue

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, ongole, prakasham, nellore, janasena activists, cine critic, kathi mahesh, akhila priya, nandyal, tourism minister, janasena, TDP, krisha ferry incident, victim familes, , krishna ferry victim families, TDP leaders, wrong propaganda, paritala ravi, tonsure, gundu, ethnic qualities, fatima students, fatima medical college, fatima students pawan kalyan, caste, Indian, human, rajamundry, party activists, telugu states tour, political tour, Andhra Pradesh

Actor turned politician janasena chief power star pawan kalyan questions modi government on andhra pradesh special status issue.

ఏపీ స్పెషల్ స్టేటస్ అంశంపై మళ్లీ గర్జించిన పవన్

Posted: 12/09/2017 01:31 PM IST
Pawan kalyan agian questions on ap special status issue

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ను మరోమారు కేంద్రానికి గుర్తుచేసిన జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్.. కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పార్లమెంటు సాక్షిగా అధికారంలోని ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలకు.. అవే ప్రభుత్వాలు విలువనీయని పక్షంలో కేంద్రం చెప్పిన మాటలకు తామెందుకు అత్యంత విలువను ఇవ్వాలని ప్రశ్నించారు. అధార్ కార్డులను కేంద్రప్రభుత్వ పథకాలు, ప్యాన్, ఇన్యూరెన్స్, మొబైల్, డిమ్యాట్, బ్యాంకు అకౌంట్లకు తామెందుకు అనుసంధానం చేయాలని ప్రశ్నించారు.

చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా ఒంగోలులోని ఏ1 ఫంక్షన్‌ హాలులో ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడుతూ.. నైతిక విలువలను కలిగి కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలకు ప్రజల అధరణ, అభిమానం పోందుతాయని అన్నారు. ఇస్తామన్న ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వనప్పుడు.. తామెందుకు అధార్ కార్డును ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని సంపాదించమే రాజకీయ పార్టీలో చేసే పని అని, అయితే అందుకు భిన్నంగా హామీలను ఇవ్వడం వాటిని తుంగలో తొక్కడం అధికారంలోకి వచ్చిన పార్టీలకు పరిపాటిగా మారిందని పవన్ విమర్శించారు.

ప్రజల అధారాభిమానాలు కోల్పోతే, ఎంతటి రాజకీయ పార్టీలకైనా చిత్కారాలు తప్పవని, మళ్లీ అధికారంలోకి రావడమన్నది అందని ద్రాక్షాగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన మాటలు తప్పుతూ, పరిపాలన కొనసాగిస్తే... ప్రజల్లో విప్లవాలు వస్తాయని హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టాలని తాను భావించి ఉంటే కాకినాడ సభ నుంచే రెచ్చగొట్టేవాడినని... కానీ, తాను అలా చేయలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే తెలంగాణ వచ్చిందని... స్పెషల్ స్టేటస్ కోసం తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles