ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ను మరోమారు కేంద్రానికి గుర్తుచేసిన జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్.. కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పార్లమెంటు సాక్షిగా అధికారంలోని ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలకు.. అవే ప్రభుత్వాలు విలువనీయని పక్షంలో కేంద్రం చెప్పిన మాటలకు తామెందుకు అత్యంత విలువను ఇవ్వాలని ప్రశ్నించారు. అధార్ కార్డులను కేంద్రప్రభుత్వ పథకాలు, ప్యాన్, ఇన్యూరెన్స్, మొబైల్, డిమ్యాట్, బ్యాంకు అకౌంట్లకు తామెందుకు అనుసంధానం చేయాలని ప్రశ్నించారు.
చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా ఒంగోలులోని ఏ1 ఫంక్షన్ హాలులో ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడుతూ.. నైతిక విలువలను కలిగి కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలకు ప్రజల అధరణ, అభిమానం పోందుతాయని అన్నారు. ఇస్తామన్న ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వనప్పుడు.. తామెందుకు అధార్ కార్డును ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని సంపాదించమే రాజకీయ పార్టీలో చేసే పని అని, అయితే అందుకు భిన్నంగా హామీలను ఇవ్వడం వాటిని తుంగలో తొక్కడం అధికారంలోకి వచ్చిన పార్టీలకు పరిపాటిగా మారిందని పవన్ విమర్శించారు.
ప్రజల అధారాభిమానాలు కోల్పోతే, ఎంతటి రాజకీయ పార్టీలకైనా చిత్కారాలు తప్పవని, మళ్లీ అధికారంలోకి రావడమన్నది అందని ద్రాక్షాగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన మాటలు తప్పుతూ, పరిపాలన కొనసాగిస్తే... ప్రజల్లో విప్లవాలు వస్తాయని హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టాలని తాను భావించి ఉంటే కాకినాడ సభ నుంచే రెచ్చగొట్టేవాడినని... కానీ, తాను అలా చేయలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే తెలంగాణ వచ్చిందని... స్పెషల్ స్టేటస్ కోసం తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more