వ్యక్తుల సమాచారానికి సంబంధించిన అధార్ కార్డును ప్రభుత్వ పథకాలతో లింక్ చేయాలా..? వద్దా అన్న విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న క్రమంలో ఇదివరకే వ్యక్తిగత గోప్యత పౌరుల హక్కు అని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో నిర్ణయం చెప్పాల్సింది న్యాయస్థానమే కనుక అ విషయాన్ని పక్కన బెడితే.. ఈ గోప్యత వివరాలను వివిధ ప్రభుత్వ సేవలకు, సంక్షేమ పథకాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇందుకు డెడ్ లైన్ మాత్రం ఈ ఏడాది చివరికి కాకుండా వచ్చే అర్థిక సంవత్సరం చివరినాటికి అంటే మార్చి 31 నాటికి డెడ్ లైన్ పొడగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. డిగించనున్నట్లు పెడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేస్తూ ధాఖలైన వ్యాజ్యాలపై వచ్చేవారం విచారణ జరగనున్న సందర్భంగా.. ఐదుగురు సభ్యులతో కూడి రాజ్యాంగ ధర్మాసనం వచ్చేవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
ఈ మేరకు ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ న్యాయస్థానానికి వెల్లడించారు. అయితే మొబైల్ నంబర్లకు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకే చివరి తేదీ అని.. ఆ గడువును పొడగించట్లేదని అటార్నీ జనరల్ తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు ఆధార్ కార్డు తీసుకోనివారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోమని చెప్పిన ఆయన వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తించనున్నట్లు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more