అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన ప్రభుత్వ సలహాదారు ఇవాంక ట్రంప్ ఇవాల తెల్లవారు జామున భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ మహనగరానికి చేరుకున్నారు. ఇవాళ అమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అమెకు రాష్ట్ర ప్రభుత్వం తరపున్న ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో హై సెక్యూరిటీ కాన్వాయ్ తో ఇవాంక మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు.
ఎయిర్ పోర్టులో సిఐడి ఐజీ షికా గోయెల్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇవాంకతో పాటు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వీఐపీలు, వీవిఐపీలులకు ఘనంగా స్వాగతం పలికారు అధికారులు. వారిని భారీ భద్రత మధ్య సిటీలోని స్టార్ హోటళ్లకు తీసుకెళ్లారు. ఇక ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. తర్వాత హెచ్ఐసిసిలోని సెకండ్ ఫ్లోర్లో భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఇవాంక ట్రంప్ భేటీ అవుతారు.
అగ్రరాజ్య ప్రభుత్వ సలహాదారు హోదాలో అమె తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అమెకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి అతిథ్యమిచ్చి చిరకాలం గుర్తిండిపోయేలా అతిథ్యమివ్వనుంది. అందుకు చారిత్రాత్మకమైన ఫల్ నుమా ఫ్యాలెస్ కూడా అందంగా ముస్తాబు చేయించారు. ఇవాంకా ట్రంప్ రెండు రోజుల పర్యటనలో తొలిరోజున అమె ప్రపంచ పారిశ్రామికవేత్తల సమావేశంలో, తెలంగాణ ప్రభుత్వ విందులో పాల్గననున్నారు.
ఇక రెండో రోజు కూడా అమె ట్రైడెంట్ హోటల్ లో ఔత్సాహిక మహిళా పారిశ్రమిక వేత్తలతో భేటీ కానున్నారు. అంతకుముందు అమె పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరవుతారని సమాచారం. ఆ తరువాత అమె హైదరాబాద్ నగరాన్ని పర్యటిస్తారు. అయితే అమె చార్మినార్ వంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శిస్తారని తెలుస్తుంది. ఇందుకోసం అమె తన పర్యటనలో కొంత సమయాన్ని రిజర్వు చేసుకున్నారని సమాచారం. ఇక ఇవాంక ఇక్కడి గాజులను కొంటారన్న వార్తలు కూడా తెరపైకి రావడంతో అమెకోసం అనేక కొత్త వెరైటీ గాజులను తయారు చేయించి సిద్దం చేశారు పాతబస్తీలోని దుకాణాదారులు. ఇక రేపు బుధవారం సాయంత్రం 5:35 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి తిరుగు పయనం కానున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more