చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగు విద్యార్థులతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు కూడా ఈ పెను విధ్వంసం సృష్టించారు. యూనివర్షిటీలోని లెక్చరర్ల వేధింపులకు నిరసనగా విద్యార్థులు ఈ హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. హైదరాబాదుకు చెందిన రాధమౌనిక అనే విద్యార్థిని లెక్చరర్ వేధింపులు భరించలేక.. ఆత్మహత్యకు పాల్పడటంతో అగ్రహానికి గురైన విద్యార్థులు హింసాకు తెగబడ్డారు. యూనివర్సిటీ సహా హాస్టల్ క్యాంపస్ లలో విధ్వంసాలను సృష్టించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సత్యభావ యూనివర్సిటీలో హైదరాబాద్ కు చెందిన దువ్వూరి రాధమోనికా రెడ్డి కంప్యూటర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షలో కాపీకి పాల్పడిందంటూ పరీక్ష హాల్ నుంచి ఆమెను కాలేజీ ఫ్రోఫెసర్లు బయటకు పంపించేశారు. అనంతరం ఇతర పరీక్షలు రాసేందుకు కూడా ఆమెకు అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు అమెను విద్యార్థులందరి ఎదుట అవమానించడంతో అమె పరాభవానికి గురైంది. మానసిక వేధనకు గురైన అమె 'మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్' అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అంతకు ముందు, అదే కళాశాలలో చదువుతున్న సోదరుడితో వీడియో కాల్ మాట్లాడింది. దీంతో ఆమెను అనునయించడానికి హుటాహుటీన ఆమె ఉంటున్న హాస్టల్ కు చేరుకున్న సోదరుడ్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అతను ఎంత ప్రాధేయపడినా వారు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె ఆత్మహత్యను ఆపలేకపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తెలుగు విద్యార్థులు కళాశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. యూనివర్సిటీ బస్సులకు నిప్పుపెట్టారు. మంటలు ఎగసిపడడంతో వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రాగా, వారిని విద్యార్థులు అడ్డుకున్నారు.
తెలుగు విద్యార్థులతో పాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న అమె స్నేహితులు, క్లాస్ మేట్స్ అందరూ విధ్వంసానికి పాల్పడటంతో.. ఎట్టకేలకు యూనివర్సిటీ యాజమాన్యం దిగివచ్చింది. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. విద్యార్థిని ప్రాణాలు పోతున్నాయన్నా.. కనికరించని సెక్యూరిటీపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయినా విద్యార్థులు శాంతించకపోవడంతో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. జనవరి 1 వరకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. తక్షణం విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో విద్యార్థులు ఇళ్ల బాటపట్టారు.
Student demanding justice began protesting which broke out into full blown violence and arson. Police personnel have been deployed all over campus and the situation is now under control. @TheQuint #SathyabamaUniversity pic.twitter.com/zel3ihd5MX
— Smitha T K (@smitha_tarur) November 22, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more