దేశంలోని న్యాయస్థానాల్లో ఇప్పటికే వేల కొలది కేసులు పెండింగ్ లో వున్నాయన్న డైలాడ్ మూడు దశాబ్దాల క్రితం విడుదలైన పలు చిత్రాల్లో వినిపిస్తుంది. మరి మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడు మరెన్నో కేసులు న్యాయస్థానాలకు చేరుతునే వున్నాయి. ఈ క్రమంలో న్యాయస్థానాలకు ( మరీ ముఖ్యంగా తీర్పులను వెలువరించే న్యామూర్తులకు) పనిభారం అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఈ వ్యాఖ్యలను మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులు కూడా పలుమారు వ్యాఖ్యానించారు.
అయితే వీరి పని భారిన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు ప్రభుత్వాలు, సీజేలు చూసుకున్నా.. మనవరకు మాత్రం కూడా కొన్ని పాటిస్తే సరిపోతుందన్నది కాదనలేని వాస్తవం. అదేంటంటే.. వారికున్న అమూల్యమైన సమయాన్ని వృధా చేసేలా పలు ప్రజావాఖ్యం కేసులను తెరపైకి తీసుకురాకపోతే మంచింది. కానీ ఎంతో ఈజీగా చిన్న పిల్ లో పెద్ద గుర్తింపు తెచ్చుకునేందుకు పలువురు ఈ మార్గాన్ని కూడా ఎంచుకోగా.. అందులో కొన్ని నిజంగానే ప్రజావసరం కోసం ఉపయోగపడగా, కొన్ని మాత్రం సమయాన్ని వృధా చేస్తాయి.
అయితే మహనీయుల అశయాలకు అనుగూణంగా దేశంలోని కరెన్సీపై మహాత్మ గాంధీ అని ముద్రిస్తున్నా.. ఆయన అశయాలకు కరెన్సీ నోట్లు మాత్రం తూట్లు పోడుస్తున్నాయని.. ఈ క్రమంలో దాఖలైన ఓ పిటీషన్ విచిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చింది. అశయాలు సిద్దంచని పక్షంలో ప్రభుత్వ, పాలకులు చర్యలు తీసుకోవాలి కానీ.. నోటుపై ముద్రించే మహాత్మా గాంధీ పేరు ముందు మహాత్మను తొలగించాలని వాదించారు. ఈ మేరకు రీసెర్చ్ స్కాలర్ ఎస్. మురుగనాథం మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు.
ఈ పిల్పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని జస్టిస్ సుందర్ తో కూడిన ద్విసభ్య బెంచ్.. విచారణ చేపట్టి.. పిల్ ను కొటంటివేసింది. దీంతో పాటు కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినందుకు గాను పిటిషనర్ పై రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. గాంధీ పేరుకు ముందు 'మహాత్మ' అని ఉపయోగించడం రాజ్యాంగంలోని ప్రకరణ 14, 18లకు విరుద్ధంగా ఉందని ఎస్. మురుగనాథం తన పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే 'మహాత్మ' అనే బిరుదు ఏదైనా రాష్ట్రం గానీ, దేశం గానీ ఇవ్వలేదని, ఆ బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చింది కావడం వల్ల రాజ్యాంగానికి విరుద్ధంకాదని కోర్టు వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more