సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన సమయంలో ప్రేక్షకులందరూ తప్పనిసరిగా లేచి నిల్చోవాలంటూ గతంలో ఉత్తర్వులను జారీ చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇకపై ఆ అవసరం లేదని సవరణ చేసింది. సినిమాహాళ్లలో ప్రేక్షకులు జాతీయగీతాలాపన సమయంలో తప్పనిసరిగా లేచి నిల్చోని తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వినోదం కోసం సినిమాహాళ్లకు వచ్చే ప్రేక్షకుడి దేశభక్తిని పరీక్షించే కొలమానం కాకూడదని దేశఅత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.
జాతీయ గీతాలాపన అంశమై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం విచారిస్తూ.. ఈ మేరకు కేంద్రాన్ని ఫ్లాగ్ కోడ్ నిబంధనలను సవరించాలని సూచించింది. ‘నిరంతరాయ వినోదం కోసం సినిమాలకు వెళ్లిన ప్రేక్షకులపై దేశభక్తిని జొప్పించేందుకు జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయడం. ప్రేక్షకులందరూ తప్పనిసరిగా నిల్చునేట్లు చేయడం కూడా అసమంజసమని అభిప్రాయపడిన న్యాయస్థానం.. ఈ విషయంలో తమ భుజాలపై తుపాలకు పెట్టి కేంద్రం కాల్చేందుకు ప్రయత్నిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
దీంతో గత ఏడాది డిసెంబర్ 1న తామిచ్చిన ఉత్తర్వుల్లో పదాన్ని ‘తప్పనిసరి’ బదులు ‘చేయొచ్చు’ అని మార్చేందుకు సిద్ధమని తెలిపింది. జాతీయ గీతాలాపన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ విచక్షణకు వదిలేయాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలను తోసిపుచ్చుతూ.. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. అప్పటిలోగా జాతీయగీతం ఎక్కడ అలపించాలి, ఎక్కడ పాడకూడదో స్పష్టంగా చెబుతూ ప్లాగ్ కోడ్ ను సవరణపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more