ఫేక్ బాబా ఆరోపణలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఎవరూ చేయకూడని పని చేశాడు. లైంగిక ఆరోపణల చుట్టు ముట్టడంతో వారి నోళ్లు మూయించేందుకు తనకు తానుగా శిక్ష విధించుకుని అందరిని దిగ్భ్రాంతికి గురిచేశాడు. రాజస్థాన్ లోని తారానగర్ లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్లితే..
సంతోష్ దాస్ (30) అనే వ్యక్తి తనను తాను దైవంగా ప్రకటించుకుని భక్తులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన దొంగబాబా అని, అతనికి ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందని ఇరుగుపొరుగువారు ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన ఆయన అక్కడే తన జననాంగాన్ని కోసేసుకున్నారు. దీంతో ఆయనపై ఆరోపణలు చేసిన వారు బిత్తరపోయారు.
వెంటనే ఆయనను బికనేర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. దీంతో స్థానికులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఘటనపై విచారణ చేపట్టారు.
హైదరాబాద్ లో ఒకరి అరెస్ట్...
హైదరాబాదులో మరో దొంగ బాబా ముసుగు తొలగింది. భూత వైద్యం పేరుతో బూతు వైద్యం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా నుంచి కొంత కాలం క్రితం విరాళాల సేకరణ పేరిట హైదరాబాదు వచ్చాడు మన్నన్ బాబా. ఈ క్రమంలో భూతవైద్యం పేరిట హుమయూన్ నగర్ లో మకాం వేశాడు. అమాయక ముస్లిం మహిళలను గుర్తించి, వారికి సమస్యలు ఉన్నాయని బెంబేలెత్తించేవాడు. అనంతరం సమస్యలు పరిష్కరిస్తానని వలలో వేసుకునే వాడు. అతనిని నమ్మిన అనంతరం వారి శరీరంపై సాతా(సైతాను)ను వాలిందని వారిని బెంబేలెత్తించేవాడు.
వైద్యం, శాంతి, పరిహారం పేరిట వారిని వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో మగపిల్లాడి కోసం ఆశపడ్డ మహిళకు ఎవరో అతనిని సూచించగా, అతనిని ఆశ్రయించింది. వేధింపులకు తాళలేకపోయిన మహిళ డీసీపీ వెంకటేశ్వరరావును ఆశ్రయించింది. దీంతో పక్కా ప్రణాళిక వేసి అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4 లక్షల రూపాయలను నకిలీబాబా దోచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మరికొందరు బాధిత మహిళలు కూడా అతనిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more