నగర శివార్లలో దారుణం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకున్ని వున్న నిర్మానుష్ ప్రాంతంలో ఏకంగా ఐదుగురి మృతదేహాలు లభ్యం కావడం పెను కలకలం రేపుతుంది. తొలుత ముగ్గురు యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయని సమాచారంతో సంచలనం కాగా.. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టగా,, మహిళల మృతదేహాలకు సమీపంలోనే మరో ఇద్దరు పురుషుల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో స్థానికంగా పెను సంచలనం రేగింది. ఘటనాస్థలానికి సమీపంలోని ప్రజలు వచ్చి చూసి.. కుటుంబం మొత్తం అత్మహత్య చేసుకుందని విషాదంలో మునిగిపోయారు.
రామచంద్రాపురం మండలం కొల్లూరు.. శంకర్ పల్లి మండలం ఇంద్రానగర్ కంచె సరిహద్దు ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. వారిని అమీన్ పూర్ గ్రామ నివాసస్థులుగా గుర్తించారు. పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు కూతళ్లు, కుమారుడితో పాటు శ్రీశైలం వెళ్లివస్తామని బంధువులకు చెప్పి వెళ్లారు. అయితే వెళ్లినవారు ఇంకా ఇంటికి తిరిగిరాకపోవడంతో రెండు రోజుల క్రితం వారి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్పింగ్ కేసు నమోదు చేశారు.
ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి మృతదేహాలు నిర్మానుష్య ప్రాంతంలోని చెట్ల పోదల్లో పడివుండగా, పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి తో పాటు అతని కుమారుడు వర్జిత్ రెడ్డి మృతదేహాలు స్విస్ట్ డిజైర్ కారులో వున్నాయి. అయితే వీరు అర్థిక ఇబ్బందులకు గురై కుటుంబం మొత్తం బలన్మరణాలకు పాల్పడ్డారా..? లేక అస్తుల లావాదేవీల విషయంలో ఎవరైనా వీరిని వెంబడించి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం.. అధారాలను సేకరించే పనిలో వుంది.
కాగా కుటుంబసభ్యులందరూ ఆత్మహత్యలకు పాల్పడినట్లుగా పలు అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు వారు తమ కారులో కొల్లూరు వద్దకు చేరుకుని అక్కడ కవర్లో తమ వెంట తీసుకోచ్చిన అహార పధార్థాలను తీసుకున్నట్లు కూడా అక్కడ కొన్ని అధారాలు లభ్యమవుతున్నాయి. అయితే అవి వీరు తెచ్చుకున్నవేనా..? లేక అంతకుముందే ఎవరైనా తెచ్చుకన్నారా..? అన్న వివరాలు తెలియాలి. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మృతుల కాల్ డేటా అధారాంగా కూడా దర్యాప్తును ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more