మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కమలనాధులు విజయదుందుభి మ్రోగించిన వెనువెంటనే అదే అధికార బీజేపీ చుక్కలు చూపించింది విపక్షం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగరా మ్రోగిన వేళ, త్వరలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్డు విడుదల కానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో తమ ఉనికిని, సత్తాను చాటేందుకు కాంగ్రెస్ నేతలకు కాసింత ఉత్సాహాన్ని అందించే విధంగా మహారాష్ట్రలోని ఎన్నికల ఫలితాలు ప్రస్పుటించాయి.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అధికార బీజేపి పార్టీ పెద్ద సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని.. తమకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టువుందన్న విషయాన్ని నిరూపింతం చేసింది. మొత్తం 3.489 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, బీజేపీ 1,457 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 301తో రెండో స్థానంలో, శివసేన 222తో మూడో స్థానంలోనూ, ఎన్సీపీ 194 స్థానాలతో నాలుగో స్థానంలోనూ నిలిచాయి.
కాగా, అధికారంలో ఉన్న బీజేపీ, శివసేనలకు షాకిస్తూ, నాందేడ్ - వాఘాలా మునిసిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ ఘనవిజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మొత్తం 54 స్థానాలకు గాను 49 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 3 స్థానాల్లో, శివసేన ఒక స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈ ఎన్నికలలో ఎంఐఎంకు పెద్ద షాక్ తగిలింది. గత ఎన్నికలలో 11 కార్పోరేటర్లతో రాజకీయ పార్టీలో హావా చాటిన ఎంఐఎం.. ఈ ఎన్నికల ఫలితాలో మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీపై ప్రజలకు ఆశలు ఎంతమాత్రమూ లేవని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more