మధ్యతరగతి ప్రజలారా.. త్వరపడండీ లేదా.. భారం తప్పదు.. ఇది పూర్తిగా నిజం. అయితే కేంద్రం తీసుకుంటున్న ఓ తాజా నిర్ణయం త్వరలోనే మద్యతరగతి ప్రజలపై భారాన్ని మోపనుంది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటికిప్పుడు మాత్రం భారం పడతున్నా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనాలు చేకూరునున్నాయని కేంద్రం భావిస్తుంది. అదేంటంటే త్వరలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా జీఎస్టీ కిందకు తీసుకురానున్నారు. ఈ మేరకు రానున్న జీఎస్టీ సమావేశంలో ఈ అంశమై కౌన్సిల్ లో చర్చ జరుగనుంది.
ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. హార్వర్డ్ యూనివర్శిటీలో మాట్లాడారు. ఇండియా చేపట్టిన పన్ను సంస్కరణలపై అభిప్రాయాలను వినిపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో పన్ను ఎగవేత జరుగుతున్నదని.. త్వరలోనే ఆ రంగాన్ని కూడా జీఎస్టీ కిందకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జీఎస్టీ మండలి నిర్వహించే తర్వాత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. గౌహతిలో నవంబర్ 9వ తేదీన తర్వాత జీఎస్టీ సమావేశాలు జరగనున్నాయి.
నగదు మార్పిడి ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్నదని… అక్కడే ఎక్కువ శాతం పన్ను కూడా ఎగవేస్తున్నారని, రియల్ ఎస్టేట్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు జైట్లీ. రియల్ రంగాన్ని జీఎస్టీ కిందకు తీసుకురావాలని తాను కూడా గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో జరిగే జీఎస్టీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు.. రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయని, అందుకే దానిపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ నిర్మాణాలపై 12 శాతం జీఎస్టీ వసూల్ చేస్తున్నారు. అయితే భూమి, స్థిరాస్తులపై మాత్రం జీఎస్టీ లేదు. నోట్లు రద్దు అనేది ప్రాథమిక సంస్కరణ అని…దేశాన్ని పన్ను ఎగవేత నుంచి ఆదుకునేందుకు తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర అర్థిక మంత్రి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more