స్నేహితులుగా పరిచయం చేసుకుని ఆ తరువాత వారిపై దారుణాలకు పాల్పడే మేకవన్నె పులులు వీళ్లు. అంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ముగ్గురు మృగాళ్లు దారుణంగా వ్యవహరించారు. కామాంధుల చెర నుంచి స్నేహితురాలి సాయంతో బయటపడిన బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా పరువు పోతుందని భావించి.. గుట్టుగా వుంచింది. అయితే పైశాచిక మృగాళ్లు మాత్రం తాము చేసిన దారుణాన్ని ఘణకార్యమనుకుని పదిమందికీ పంచాలని సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అడ్డంగా బుక్ అయ్యారు.
వీరి అఘాయిత్యం తాలుకు ఘటనలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో, అది కాస్తా అలా అలా బాలిక తల్లిదండ్రుల దృష్టికి చేరింది. దీంతో తమ బిడ్డను వివరాలు అడిగి తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు.. మగ్గురు అగంతకులపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి రాగా, రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిపై అత్యాచార యత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరికి చెందిన ఓ యువతి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. అయితే ఆ అమ్మాయి స్థానికంగా ఇంజనీరంగ్ చేస్తున్న కార్తీక్ అనే యువకుడితో సన్నిహితంగా వుంటుంది. అయితే కార్తీక్ తన స్నేహితులు పవన్, సాయి, కోటేశ్వర రావులతో కలసి కనిగిరిలోని అలయ దర్శనానికి వెళ్లారు. అయితే బాధితురాలిని కూడా రమ్మని కార్మీక్ ను మిత్రులు సాయి, పవన్ లు కోరారు. దీంతో అమెను కూడా రమ్మని పిలవడంతో ఒంటరిగా కాకుండా తనకు తోడుగా మరో స్నేహితురాలని తీసుకుని వచ్చింది బాధితురాలు.
అలయ దర్శనం పూర్తైన తరువాత పక్కనే వున్న నిర్మానుష్య ప్రాంతంలోకి బాధితురాలిని తీసుకువెళ్లిన సాయి.. అక్కడ అమైపై అత్యాచారంయత్నానికి తెగబడ్డాడు. వద్దని అరుపులు, కేకలు పెడుతున్నా.. సరదాగా ఏడిపిస్తున్నాడని అనుకున్న అమె స్నేహితురాలు.. బాధితురాలి ఏడుపు విని నిజమని తెలిసి అడ్డుకుంది. దీంతో అక్కడి నుంచి బాధితురాలిని తీసుకువచ్చింది. జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పినా పరుపుపోతుందని భావించిన బాధితురాలు గుట్టుగా తనలోనే బాధను దిగమించుకుంది.
అయితే బాధితురాలిపై అత్యాచార యత్నం జరుగుతున్న క్రమంలో వీడియోను తీసిన స్నేహితులు.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో విషయం బట్టబయలైంది. నేరానికి పాల్పడిన సాయి అనే అగంతకుడితో పాటు.. నేరాన్ని ప్రోత్సహించిన అతని స్నేహితులు కార్తీక్, పవన్, కోటేశ్వరావులపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడడమేగాక ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more