భారతీయ శాస్త్రవేతల నైపుణ్యం.. వారి తేజోవంతమైన మేదస్సును కొనియాడాల్సిన అవసరం వుంది. 2013 నవంబర్ 5న భారత దేశం అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపేందుకు సన్నధమైన క్రమంలో పలు దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. విఫలయత్నం కాక తప్పదన్న వార్తలు వచ్చినా.. వెనక్కు తగ్గిన ఇస్రో శాస్త్రవేత్తలు.. అత్యంత చౌకధరతో దానిని ప్రయోగించి.. సఫలీకృతమయ్యారు. అరు నెలల పాటు పనిచేస్తే చాలునని భావించి ప్రయోగించిన ఈ వ్యోమనౌక అంగారక కక్షలోకి వెళ్లి ఏకంగా మూడేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుని దిగ్విజయంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తుంది.
మంగళయాన్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించారు. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం అనంతరం ఆ వ్యోమనౌక.. 2014 సెప్టెంబర్ 24న విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. తద్వారా మొదటి ప్రయత్నంలోనే ఆ గ్రహం వద్దకు చేరుకున్న తొలి దేశంగా భారత్ ఘనత సాధించింది. కేవలం రూ.450 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టడం విశేషం.
అంగారకుడిపై ఉన్న ఖనిజాల నిల్వలను, జీవజాలం ఉనికికి ఆధారంగా భావిస్తున్న మీథేన్ వాయువు ఆనవాళ్లను పట్టుకోవడం వంటి లక్ష్యాలను దీనికి నిర్దేశించారు. ఇందులో ఐదు సైన్స్ పరికరాలను అమర్చారు. అందులోని మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) ద్వారా 715 ఫొటోలను తీశారు. ఈ వ్యోమనౌకలో అనేక సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉందని 2015 జూన్లో ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళయాన్ మూడేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో 2014 సెప్టెంబర్ 24 నుంచి గత ఏడాది సెప్టెంబర్ 23 వరకూ అది సేకరించిన డేటాను ఇస్రో విడుదల చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more