మొబైల్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. అక్టోబర్ ఒకటి నుంచి మీ కాల్ చార్జీలు తగ్గనున్నాయ్. ఈ మేరకు టెలికాం రెగ్యూలేటరి అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) నిర్ణయం తీసుకుంది. ఇంటర్ కనెక్షన్ చార్జీలను (ఐయూసీ)లను తగ్గించడంతో సెల్ ఫోన్ వినియోగదారులకు కాల్ చర్జీలు తగ్గే అవకాశం వుంది. ప్రస్తుతం ఐయూసీలకు 14 ఫైసలను వసూలు చేస్తుండగా, అక్టోబర్ 1 నుంచి వీటి చార్జీలను 6 ఫైసలకు తగ్గించనున్నారు. దీంతో అదే నెట్ వర్క్ కాకుండా ఇతర నెట్ వర్క్ ఫోన్లకు చేసే కాల్ చార్జీలు కూడా తగ్గనున్నాయి.
ఈ మేరకు ట్రాయ్ ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెలువరించింది. జనవరి 1 2020 నుంచి అంటే మరో రెండేళ్ల తరువాత ఐయూసీ చార్జీలను సున్నాగా చేయనున్నామని వెలువరించింది. అంటే ఇక ఏ సెల్ ఫోన్ అపరేటర్ నుంచి మరో సెల్ ఫోన్ అపరేటర్ కు ఎన్ని ఫోన్లు చేసుకున్నా ఒకొరికోకరు ఎలాంటి చార్జీలను భరించాల్సిన అవసరం లేదని కూడా ట్రాయ్ స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లు ఈ చార్జీలను భరిస్తున్న సెల్ ఫోన్ వినియోగదారులకు లబ్ది చేకూరనుందని ట్రాయ్ వివరించింది.
రిలయన్స్ జియో రాకతో వాయిస్ కాల్స్ కు డబ్బు కట్టే పరిస్థితి లేకుండా పోవడం.. దాంతో పాటు డాటా కూడా అత్యంత చౌకధరకు అందుబాటులోకి రావడంతో.. శరవేగంగా కస్టమర్లను తమ ఖాతాలోకి వెసుకుంటుంది. దీంతో ఐయూసీ చార్జీలను తగ్గించాలని ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ విషయమై దృష్టి సారించిన ట్రాయ్ ఈ మేరకు ఇవాళ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఐయూసీ చార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని కూడా తెలిపింది.
అయితే ట్రాయ్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా వుందని, ఇప్పటికీ అత్యంత తక్కువగా వున్న ఐయూసీ చార్జీలను సగానికి పైగా తగ్గించడం తమపై అదనపు భారం పడుతుందని టెలికాం రంగ దిగ్గజ సంస్థ అక్షేపిస్తున్నాయి. దీనిపై తాము న్యాయస్థానాలను అశ్రయిస్తామని భారతి ఎయిర్ టెల్ యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా ట్రాయ్ తీసుకన్న ఐయూసీ చార్జీల తగ్గింపు నిర్ణయంతో రిలయన్స్ జియో సంస్థకు సుమారుగా రూ.5000 కోట్లు వార్షికాదాయం లబ్ది చేకూరుతుండగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు, ఎయిర్ సెల్ సంస్థలకు చెరో రూ. 250 కోట్లు లాభం చేకూరనుంది. అయితే భారతీ ఎయిర్ టెల్ సంస్థకు రూ.2వేల కోట్లు, వోడాఫోన్ కు రూ.1500 కోట్లు, ఐడియా సెల్యూలార్ సంస్థకు ఏడాదికి రూ.1200 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనుందని అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more