దేశవ్యాప్తంగా ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చిన కేంద్రం జీఎస్టీ పేరుతో ప్రజల సోమ్మును కొల్లగోడుతూనే వుంది. అన్నింటికీ వర్తించే జీఎస్టీ ఇంధనంపై మాత్రం వర్తించకుండా చర్యలెందుకు తీసుకుందో తెలియని పరిస్తితి. ఇక అదేబాటలో దేశవ్యాప్తాంగా ఒక మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష అంటూ కేవలం ఉత్తరాది వారికే పెద్దపీటే వేసే కుట్ర జరుగుతుందని అరోపిస్తూ నీట్ పరీక్షలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలలో అంధోళనలు జరుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన అనిత అనే ఓ విద్యార్థిని నీట్ ను వ్యతిరేకిస్తూ తనపు చాలించుకుంది కూడా.
అయినా తనకేమీ పట్టనట్లు వ్యహరిస్తున్న కేంద్ర మానవ వనరుల శాఖ 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలను కూడా రాష్ట్రస్థాయిలో బంద్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇకపై ఇంజనీరింగ్ కోర్పుల ప్రవేశాలకు కూడా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కసరత్తును ప్రారంభించింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్ ప్రవేశాలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారానే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాలకు ఇప్పటికే అదేశాలను జారీ చేసినట్లు తెలిసింది.
ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ ప్రవేశపరీక్షల అధారంగానే ఇకపై ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలను చేపట్టనున్నాట్లు రాష్ట్రప్రభుత్వాలకు పంపిన అదేశాలలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పొందుపర్చింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశం కోరుకునే విదర్యార్థులు ఇక తప్పకుండా జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష తర్వాత విద్యార్థులు జాతీయ స్థాయిలో పొందిన ర్యాంకులకు అనుగుణంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ద్వారా ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారు. ఇదే జరిగితే ఎంసెట్ పరీక్ష కేవలం బిపార్మసీ, వ్యవసాయ కొర్సులకు మాత్రమే నిర్వహించాల్సివుంటుంది. దీంతో ఎంసెట్ పేరు కాస్తా మార్చి మరో పేరుతో ప్రవేశాలను నిర్వహించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more