నోట్ల రద్దు చేప్టటిన తరువాత నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోని కేంద్రం.. దీని ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కొత్త పల్లవిని అందుకున్న క్రమంలో.. దేశవ్యాప్తంగా కూడా నగదు రహిత లావాదేవీలు పుంజుకున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా నగదు రహిత లావాదేవీలు జోరందుకున్న క్రమంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ మధ్య నాగ్ పూర్ లో టోల్ గేట్ వద్ద డాక్టర్ డబ్బులు చెల్లించిగా అతని అకౌంట్లోంచి సుమారుగా మూడు లక్షల రూపాయలు తస్కరించబడ్డాయి. వెంటనే పోలిస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయగా తన డబ్బు తనకు లభించింది.
ఇక తాజాగా కూడా అదే మహారాష్ట్రలో ఓ వ్యక్తికి కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. టోల్ ప్లాజా దగ్గర డెబిట్ కార్డు స్వైప్ చేసి రూ. 230 టోల్ చెల్లిచిన గంటల వ్యవధిలోనే ఆయన ఖాతా నుంచి రూ.87వేలు మాయమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన దర్శన్ పాటిల్ ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ముంబయి నుంచి పుణె తిరిగి వస్తుండగా.. ఖాలాపూర్ టోల్ ప్లాజా వద్ద డెబిట్ కార్డు ద్వారా రూ. 230 చెల్లించాడు. రసీదు కూడా తీసుకుని వెళ్లాడు. ఆ తరువాత 2 గంటల వ్యవధిలో తన ఖాతా నుంచి 87 వేల రూపాయలు మాయమయ్యాయి. దీంతో వెంటనే ఆయన పోలీసులకు, సైబర్ సెల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద రూ. 230 చెల్లించిన తరువాత రా. 8.31 గంటలకు తన కార్డును వినియోగించి రూ. 20వేల విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్లు మెసేజ్ వచ్చింది. ఇలా వరుసగా నాలుగు నిమిషాల్లోనే ఆరు లావాదేవీలు జరిగగా వాటి మొత్తం విలువ రూ.87 వేలు. ఆ తరువాత కూడా తన కార్డును వినియోగించి రూ.100. రూ.10తో తినుబండారాలను కొన్నారని పాటిల్ తన పిర్యాదులో పేర్కోన్నారు.
కనీసం పేమెంట్ జరిగినప్పుడైనా తన మొబైల్ పోనుకు వన్ టైం పాస్ వర్డ్ కూడా రాలేదని పాటిల్ పేర్కొన్నారు. తన కార్డు పిన్ నంబర్ ఎవరికీ ఇవ్వలేదని.. టోల్ ప్లాజా వద్ద కూడా తానే సీక్రీట్ పిన్ ను ఎంటర్ చేశానని పాటిల్ చెప్పారు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అందులో చూసి ఎవరైనా తన కార్డును దుర్వినియోగం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కార్డు తనవద్ద వుండగానే తన అకౌంట్లో నుంచి నగదు మాయం కావడంపై పాటిల్ విస్మయం వ్యక్తం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more