టోల్ బిల్లు కడితే.. టోటల్ గా దోచేశారు..! Man Loses Rs. 87,000 After Swiping At Pune-Mumbai Toll Plaza

Man loses rs 87 000 after swiping at pune mumbai toll plaza

Darshan Patil, Khalapur toll plaza, Rs87000, bank,debit card, Pune Mumbai toll plaza, credit card, toll plaza, Hadapsar police station, cyber crime, crime

Swiping his card at the Khalapur toll plaza ended up taking a toll on the bank account of a sales manager from Pune. Rs. 87,000 was stolen from the account of Darshan Patil

టోల్ బిల్లు కడితే.. టోటల్ గా దోచేశారు..!

Posted: 09/12/2017 02:29 PM IST
Man loses rs 87 000 after swiping at pune mumbai toll plaza

నోట్ల రద్దు చేప్టటిన తరువాత నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోని కేంద్రం.. దీని ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కొత్త పల్లవిని అందుకున్న క్రమంలో.. దేశవ్యాప్తంగా కూడా నగదు రహిత లావాదేవీలు పుంజుకున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా నగదు రహిత లావాదేవీలు జోరందుకున్న క్రమంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ మధ్య నాగ్ పూర్ లో టోల్ గేట్ వద్ద డాక్టర్ డబ్బులు చెల్లించిగా అతని అకౌంట్లోంచి సుమారుగా మూడు లక్షల రూపాయలు తస్కరించబడ్డాయి. వెంటనే పోలిస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయగా తన డబ్బు తనకు లభించింది.

ఇక తాజాగా కూడా అదే మహారాష్ట్రలో ఓ వ్యక్తికి కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. టోల్‌ ప్లాజా దగ్గర డెబిట్‌ కార్డు స్వైప్‌ చేసి రూ. 230 టోల్‌ చెల్లిచిన గంటల వ్యవధిలోనే ఆయన ఖాతా నుంచి రూ.87వేలు మాయమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన దర్శన్‌ పాటిల్‌ ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ముంబయి నుంచి పుణె తిరిగి వస్తుండగా.. ఖాలాపూర్ టోల్ ప్లాజా వద్ద డెబిట్ కార్డు ద్వారా రూ. 230 చెల్లించాడు. రసీదు కూడా తీసుకుని వెళ్లాడు. ఆ తరువాత 2 గంటల వ్యవధిలో తన ఖాతా నుంచి 87 వేల రూపాయలు మాయమయ్యాయి. దీంతో వెంటనే ఆయన పోలీసులకు, సైబర్ సెల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో టోల్‌ ప్లాజా వద్ద రూ. 230 చెల్లించిన తరువాత రా. 8.31 గంటలకు తన కార్డును వినియోగించి రూ. 20వేల విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్లు మెసేజ్ వచ్చింది. ఇలా వరుసగా నాలుగు నిమిషాల్లోనే ఆరు లావాదేవీలు జరిగగా వాటి మొత్తం విలువ రూ.87 వేలు. ఆ తరువాత కూడా తన కార్డును వినియోగించి రూ.100. రూ.10తో తినుబండారాలను కొన్నారని పాటిల్ తన పిర్యాదులో పేర్కోన్నారు.

కనీసం పేమెంట్‌ జరిగినప్పుడైనా తన మొబైల్ పోనుకు వన్ టైం పాస్ వర్డ్ కూడా రాలేదని పాటిల్‌ పేర్కొన్నారు. తన కార్డు పిన్‌ నంబర్‌ ఎవరికీ ఇవ్వలేదని.. టోల్ ప్లాజా వద్ద కూడా తానే సీక్రీట్ పిన్ ను ఎంటర్‌ చేశానని పాటిల్‌ చెప్పారు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అందులో చూసి ఎవరైనా తన కార్డును దుర్వినియోగం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కార్డు తనవద్ద వుండగానే తన అకౌంట్లో నుంచి నగదు మాయం కావడంపై పాటిల్ విస్మయం వ్యక్తం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles