బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ దారుణ హత్య జరిగి మూడు రోజులు కావస్తున్న పోలీసులు ఇంకా ఈ కేసులో అడుగుముందుకు వేయలేదు. అందుకు కారణం వారికి హంతకుల విషయంలో ఎలాంటి కీలక అధారాలు లభ్యం కాకపోవడమే. దీంతో గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రజలకు, స్థానికులకు తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని, ఈ కేసులో నిందితులను పంట్టుకునేందుకు కీలక సమాచారం అందంచిన వారికి రూ. 10 లక్షల బహుమతి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కేసు దర్యాఫ్తు విషయాలపై హోం మంత్రి రామలింగారెడ్డితో కలసి సమీక్షించిన సీఎం సిద్ధరామయ్య, నిందితులను త్వరగా అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కాగా, ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం అందుతోంది. హంతకుల వయసు 30 సంవత్సరాల వరకూ ఉండవచ్చని, హెల్మెట్ ధరించి వచ్చాడని ఆపై పారిపోయాడని వెల్లడించారు. నిందితుడి ఊహా చిత్రాన్ని రూపొందించి, అతని ఆచూకీ కోసం రాష్ట్రమంతా గాలిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా, గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ స్పందించక పోవడాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి స్పందించే మోదీ ఓ ప్రముఖ జర్నలిస్టు విషయంలో ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నిస్తున్నాయి.
జర్నలిస్టుల దేశ వ్యాప్త ఆందోళనలకు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్యమకారుల నినాదాలకు విస్తృత ప్రచారం లభించింది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ప్రధానమంత్రి గానీ, పీఎంవోల నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ కొందరు ట్విట్టర్ వేదిక చేసిన విమర్శలు మాత్రం.. ఈ విదాదంలోకి మోదీని లాగే ప్రయత్నం చేశాయి. అందులో నలుగురి ట్వీట్లు రాజకీయ, వామపక్ష వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. ఆ నలుగులు ప్రధాని ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ కావడంతో వారి పోస్టులు సంచలనమయ్యాయి.
ఇదిలావుండగా, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయమై స్పందిస్తూ.. గౌరీ లంకేశ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎందుకని అమెకు భద్రతను కల్పించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనే మావోయిస్టులతో గౌరి చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చారని.. అలాంటి మనిషి ప్రాణహానీ వుంటుందని ప్రభుత్వానికి తెలియదా..? అయినా ఆమెకు ఎందుకు సెక్యురిటీ ఇవ్వలేదని నిలదీశారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్-బీజేపీ కార్యకర్తల హత్యలు ఉదారవాదులు ఎందుకు కనిపించవని ఆయన మరో కోణంలోకి వెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more