కత్తి కన్నా కలం గోప్పదని మరోమారు రుజువైంది. తన పదునైన అక్షరాలతో అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించిన ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేష్ దారుణహత్య ఈ విషయాన్ని చాటిచెప్పింది. అమె అక్షరాలను కబళించే ధైర్యంలేని పిరికి పందలు అమెపై తుపాకీ తూటాల వర్షం కురిపించారు. బెంగళూరు రాజరాజేశ్వరినగరలోని తన నివాసంలో ‘తాగడానికి నీరు కావాలి’ అంటూ అమెను సమీపించిన గుర్తు తెలియని దుండగులు అమెపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు.
మోటారు సైకిల్పై వచ్చిన ముగ్గురు దుండగులు 5 అడుగుల దూరం నుంచి మొత్తం ఏడు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసు అధికారులు వెల్లడించారు. రాత్రి సుమారుగా ఎనమిది గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు తూటాలు ఆమె నుదురు, మెడ, ఛాతీలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. మిగిలిన తూటాలు గోడకు తాకాయి. మరణోత్తర పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
తండ్రి నుంచి వారసత్వంగా అందుకున్న పత్రికా రంగంలో రాణిస్తునే.. ఆయన తనకిచ్చిన ఇంట్లోనే గౌరీ లంకేష్ హతమయ్యారు. వివాహిత అయిన ఆమె కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు. మహారాష్ట్రలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దుండగుల తూటాలకు బలైన నరేంద్ర దబోల్కర్, ధార్వాడలో సాహితీవేత్త ఎం.ఎం.కలబురగి హత్యల తరహాలోనే గౌరీ లంకేష్ హత్యకు గురి కావడం గమనార్హం. తన ప్రాణాలకు ముప్పుందని ఆమె ముందే వూహించారు. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులతో కూడా చెప్పారు. ఇంతలోనే ఆమె హత్యకు గురికావడం విషాదాన్ని నింపింది.
గౌరీ లంకేష్ మృతి తనను కలచి వేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన.. రెండేళ్ల కిందట సాహితీవేత్త ఎం.ఎం.కలబురగి హత్య నుంచి తేరుకునే లోగానే గౌరీ లంకేష్ను దుండగులు హత్య చేశారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, ఐజీపీ శరత్శ్చంద్ర నేతృత్వంలో ఈ బృందాలు పని చేయనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more