యుద్దానికి మేము సిద్దం అన్నట్లుగా సంకేతాలను పంపి.. దాదాపుగా 70 రోజుల తరువాత ఇన్నాళ్లకు చైనా మెట్టుదిగింది. డోక్లాం ప్రతిష్ఠంభనకు ఇన్నాళ్లు ఉన్న మంకుపట్టుకు అకస్మాత్తుగా చైనా ఎందుకు తెర దించింది? డోక్లాం ప్రాంతంలో రోడ్డు నిర్మాణం ప్రారంభించిన డ్రాగన్ దేశం.. ఒక్కసారిగా రోడ్డు నిర్మాణ యంత్ర సామాగ్రిని ఎందుకు వెనక్కి తరలించింది.? చైనా వెనక్కి తగ్గడానికి గల కారణాలే ఏంటి? అన్నది ఇప్పుడు అందరిలోనూ తలెత్తిన సందేహాలు. దీనిపై విదేశీ వ్యవహారాల నిపుణులు మాత్రం క్లారిటీ ఇస్తున్నారు. అందుకు చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ దేశాల సదస్సే కారణమా...? అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి.
సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు చైనాలోని జియామెన్ లో బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు భాగస్వామ్యం వహించనున్నాయి. ‘మెరుగైన భవిష్యత్తుకు బలమైన భాగస్వామ్యం’ అనే థీమ్ తో నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న చైనా.. భారత్ సరిహద్దులో డోక్లాం టెన్షన్ పెట్టుకుని ఈ ధీమ్ ఎలా ముందుకు తీసుకువెళ్తార్న ప్రశ్న సదస్సులో సభ్యదేశాలు ప్రశ్నించిన పక్షంలో బదులిచ్చేందుకు ఇబ్బందులు పడాల్సిన నేపథ్యంలోనే డ్రాగన్ వ్యూహాత్మకంగా ఇండిమా ముందు తలవంచిదని విదేశీ వ్యవహరాల నిపుణులు భావిస్తోంది.
కాగా, డోక్లాం నుంచి సైనికులను, రోడ్డు నిర్మాణ యంత్రసామాగ్రిని ఉపసంహరించుకున్న ,చైనా.. ఇప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదు. ఇన్నాళ్లు యుద్దానికి రంకెలు వేసిన చైనా, అకస్మాత్తుగా వెనక్కుతగ్గినా.. తమదే పై చేయి అనేలా ప్రవర్తిస్తోంది. డోక్లాం ప్రతిష్టంభన ఘటన నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని వ్యాఖ్యలు చేసింది. తమదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సరిహద్దుల్లో తమ ఆర్మీ గస్తీ నిర్వహిస్తూనే ఉంటుందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అధికారి అన్నారు. దేశ సరిహద్దుల్లో శాంతిపూరిత వాతావరణం కొనసాగేందుకు తాము కృషిచేస్తూనే ఉంటామని చెప్పుకొచ్చారు. భారత్ అంతర్జాతీయ చట్టాల కనీస సూత్రాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more