నంద్యాల ఉపఎన్నికకు నేటితో ప్రచారం ముగియనుంది. సాయంత్రం ఆరు గంటలు దాటితే ఏ పార్టీ ఏజెంట్లుగానీ, నేతలు గానీ ఉండకూదంటూ ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే సమయం దగ్గరపడుతున్న కొద్దీ భవిష్యత్తుపై భయంతో వణికిపోతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణలు వారిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి తర్వాత వివిధ కారణాలతో కుమార్తె అఖిలప్రియ, బావమరిది ఎస్వీ మోహన్రెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. అయితే నాగిరెడ్డి మరణం తర్వాత సమీకరణాలు మరింత వేగంగా మారాయి. కొందరు భూమా కుటుంబం వెంటే ఉండిపోయినా, 10-15 శాతం మంది మాత్రం వైసీపీతోనే ఉండిపోయారు. అయితే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఎటువైపు ఉండాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు.
ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైసీపీ చీఫ్ జగన్ గత కొన్ని రోజులుగా నంద్యాలలో మకాం వేసి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఈ ఉప ఎన్నికను సెమీఫైనల్గా భావిస్తున్న జగన్ ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. సరిగ్గా ఇదే వైసీపీ నేతలను భయపెడుతోంది. ఒకవేళ ఫలితం తమకు వ్యతిరేకంగా వస్తే భవిష్యత్తు ఏంటని భయపడుతున్నారు. ఇప్పటికే ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని చెబుతున్న నేతలు.. ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై పడితే తమ భవిష్యత్తు అంధకారమేనని భయపడుతున్నారు. జగన్ ఈ ఉపఎన్నికను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోకపోయి ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఉత్పన్నమై ఉండేదని కాదని అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more