ర్యాగింగ్ రక్కసి మళ్లీ జడలు విప్పింది. కొత్తగా వచ్చే విద్యార్థులతో పరిచయం చేసుకునే నేపథ్యంలో ఫ్రెషర్లను నానా చిత్రహింసలకు గురిచేసి, వారిని మానసికంగా, శారీరికంగా అవమానపర్చి.. ఆ పరాభావాలతో వారు ఏకంగా తనువునే చాలించుకున్న ఘటనలు ఇప్పటికే అనేకం చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు, ప్రభుత్వంతో పాటు ఇటు కాళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపడంతో.. గత కొన్నాళ్లుగా ర్యాగింగ్ భూతం అడ్రస్ లేకుండా పోయింది.
కాగా, మళ్లీ మరోకొత్త రూపంలో ర్యాగింగ్ రక్కసి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. కాళాశాలల్లో ర్యాగింగ్ కు పాల్పడితే యాజమాన్యమే చర్యలు తీసుకుంటుందన్న భయంతో.. కాలేజీ బస్సులో సీనియర్లు జూనియర్లపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. సినిమాల ప్రభావమో లేక.. చెడు సావాసాల ఫలితమో తెలియదు కానీ.. చదువుకుంటున్న సరస్వతీ పుత్రులు కాస్తా.. రౌడీల్లా వ్యవహరించి.. జానియర్లను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బలిస్తేనే ర్యాగింగ్ చేయమని లేదంటే ప్రతిరోజు ఇది తప్పదని హెచ్చరిస్తున్నారు.
తాజాగా సీనియర్ల ర్యాగింగ్ ఆకృత్యాలను తట్టుకోలేని ఓ విద్యార్థి పోలీస్ స్టేషన్లోకి పరుగుతీసి తాను ఎదుర్కోన్న సీనియర్ల దురాగతంపై పిర్యాదు చేశాడు. ఈ ఘటన ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. ఎల్బీనగర్ లింగజోడుకు చెందిన గిరిధర్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లోని టీడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. క్రితం రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి కాలేజీ బస్సులో వస్తుండగా, అతన్ని ఫైనలియర్ విద్యార్థులు సమీర్, నరసింహా, నరసింహా గౌడ్లు ర్యాగింగ్ పేరుతో చితకబాదారు.
కాలేజీలో బస్సు ఎక్కిన కొద్దిసేపటి నుంచి సీనియర్ల దెబ్బలు మౌనంగా తట్టుకుని నిలబడ్డ గిరిధర్.. ఆ నొప్పులను భరించలేకపోయాడు. బస్సు ఎల్బీనగర్ చేరుకోగానే పోలీస్ స్టేషన్ లోకి పరుగు తీశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయపడ్డ గిరిధర్ ను సమీప ఆసుపత్రికి తరలించారు. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీనియర్లు వంగబెట్టి దెబ్బలు కోట్టే గేమ్ తనతో ఆడారని, రూ.500 ఇస్తే వదిలేస్తామన్నారని గిరిధర్ సాక్షికి తెలిపాడు.
బీబీనగర్ నుంచి ఉప్పల్ వరకు కొట్టారని, డబ్బులు ఇవ్వకుంటే రోజు ఇలానే కొడుతామని బెదిరించినట్లు గిరిధర్ చెప్పుకొచ్చాడు. ఇక మరో విషయానికి వస్తే ఈ కాలేజీ అధికార పార్టీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తనయుడు తీగల దినేష్ రెడ్డి పేరుపై వుండటం.. అధికార ఎమ్మెల్యే కు చెందిన కాలేజీలోనే ఇలాంటి ఘటనలు నమోదు కావడంపై విద్యార్థులు తల్లిదండ్రలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more