దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కష్టాలు వెంటాడుతూనే వున్నాయి. తాజాగా ఆయన రాజకీయ అరంగ్రేటం చేస్తానన్న సంకేతాలను వెలువరించడంతో ఈ కష్టాలు మరింతగా చుట్టుముట్టాయి. రజనీ కూతురు ఐశ్వర్య నిర్మించిన కొచ్చాడియన్ చిత్రం నుంచి ఆయన కుటుంబసభ్యులతో అయన కష్టాల కడలిని ఈదుతూనే వున్నారు. తాజాగా ఆయన సతీమణి లతా రజనీకాంత్ కూడా ఆయనకు మరిన్న కష్టాలను తెచ్చిపెట్టారు. అమె నిర్వహిస్తున్న పాఠశాలకు అద్దె బకాయిలు చెల్లించని కారణంగా స్థల యజమాని తాళం వేశారు..
చెన్నైలోని స్థానిక గిండిలో రజనీ సతీమణి లత నిర్వహిస్తున్న ఆశ్రమ్ విద్యాలయ భవనానికి రూ.2 కోట్ల అద్దె బకాయి పడడంతో స్థల యజమాని స్థానిక అధికారుల చేత సీజ్ చేయించారు. దీనితో ఈ పాఠశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థులను లతా రజనీకాంత్ కు చెందిన వేళచ్చేరిలోని ఐసీఏసీ పాఠశాలకు తరలించారు. గత కొన్ని సంవత్సరాలుగా అద్దె బకాయిలు చెల్లించని కారణంగా సదరు స్థల యజమాని వెంకటేశ్వర్లు స్థానిక అధికారులను వెంటబెట్టుకుని వచ్చి పాఠశాలకు తాళం వేసి సీజ్ చేయించారు.
పాఠశాల నిర్వహిస్తున్న లతా రజనీకాంత్.. 2009 నుంచి అద్డె బకాయిలు చెల్లించలేదని అరోపిస్తూ ఆ భవనం యజమాని వెంకటేశ్వర్లు గతంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత జూన్ మాసంలో ఇరువర్గాలను చర్చలకు ఆహ్వానించింది. బకాయి పడిన మొత్తం అద్దె రూ.11 కోట్లు చెల్లించాలంటూ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తాన్ని చెల్లించలేమని చెప్పిన లతా రజనీకాంత్ రూ.2 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించినట్టు తెలిసింది. న్యాయస్థానంలో అంగీకరించిన హామీని లతారజనీకాంత్ ఉల్లంఘించినందు వల్ల ఆ పాఠశాలకు తాళం వేసినట్టు వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన పాఠశాల యాజమాన్యం.. విపరీతంగా పెంచిన అద్దెలతో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, స్థలం యజమాని నుంచి అనేక ఇబ్బందులు ఎదురవడంతో ప్రస్తుతం స్థలాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించినట్టు యాజమాన్యం తెలిపింది. పైగా ఈ సమస్యను ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయని కూడా తెలిపింది. పాఠశాల స్థలం యజమాని పెట్టిన వేధింపుల కారణంగా మానసిక ఇబ్బందులకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, సిబ్బంది తరపున చట్ట ప్రకారం చర్యలు కోరుతూ న్యాయస్థానంలో దావా వేయనున్నట్టు తెలిపింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more