నిర్మలమైనది.. స్వచ్చమైనది.. సంపదకు, స్వార్థానికి అతీతం ఎన్ని కొటేషన్లు చెప్పుకున్నా.. ప్రాణానికి ప్రాణం పెట్టే స్నేహాం చిరకాలం నిలుస్తూనే ఉంటుంది. తన ప్రాణాలు కాపాడాలంటూ ఓ మహిళ తన ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ కు వచ్చిన స్పందన ఆమె ముఖంలో నవ్వుల వెలుగును నింపింది. సుమారు పదేళ్ల తర్వాత ఓ స్నేహితుడి ద్వారా అవయవదానం, మరికొందరి సహకారంతో ప్రాణదానం జరగటం విశేషం.
ఢిల్లీకి చెందిన పూజా భట్నాగర్ (44) గత 17 ఏళ్లుగా కాలేయ సమస్యతో బాధపడుతోంది. మందులతో ఇక కష్టమని, కాలేయ మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చేశారు. దీంతో కుటుంబ సభ్యులు కాలేయ దానం చేసే వారి కోసం బంధువుల్లో ప్రయత్నించారు. అయితే ఎవరి కాలేయమూ ఆమెకు సరిపోలేదు. దీంతో తన ఫేస్ బుక్ ద్వారా భట్నాగర్ అభ్యర్థించింది. దీనిని చెన్నైలో డాగ్ ట్రైనర్ గా ఉన్న గోపీనాథ్ చూశాడు. తన స్నేహితురాలు ఆపదలో ఉందన్న విషయం తెలుసుకుని అవయవదానానికి ముందుకు వచ్చాడు.
2007లో అంటే పదేళ్ల క్రితం వేల్స్లోని గ్లామోర్గాన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తాను పూజా దంపతులతో కలిసి ఫ్లాట్ను షేర్ చేసుకున్నాడంట. రెండేళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిన గోపీ ఎఫ్ బీ లో వాళ్లతో టచ్ లో ఉంటూ వస్తున్నాడు. ఆమె తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. ఆమె అంతబాధలో ఉందని తెలిసి తానెలా చూస్తూ ఉండగలనని ప్రశ్నించారు. ఒక్కోసారి రక్తసంబంధీకులు అవయవదానానికి వెనకాడుతున్నారు. కానీ, స్నేహం కోసం గోపీ ఇలా ముందుకు రావటం విశేషమని మాక్స్ ఆస్పత్రి వైద్యుడు గుప్తా చెబుతున్నాడు.
అయితే అవయవదానం కు ఏర్పాటు జరిగినప్పటికీ, ఆపరేషన్ కోసం 25 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారంట. కానీ, ఆమె భర్త అనురాగ్ భట్నాగర్ దగ్గర అంత డబ్బు లేకపోవటంతో
గురుగ్రామ్ లోని తన స్నేహితులను ఆశ్రయించాడు. తమ స్నేహితుడు భార్య ఆపదలో ఉన్న విషయం తెలిసిన వాళ్లు తమ వంతు సాయంతోపాటు సోషల్ మీడియా ద్వారా సుమారు 363 మంది దగ్గర నుంచి ఆ డబ్బును సేకరించి డబ్బును అందించారు. జూలై 21న సాకేత్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో కాలేయ మార్పిడిని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
పాత బడినా కొద్దీ బాగుండేది ఒక్క స్నేహం మాత్రమేనేమో!
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more