తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో ఉండదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో తమ వంతు ప్రయత్నాలుగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి పెద్దలకు మొరపెట్టుకుంటూ వస్తున్నారు. అయితే తనకు మాత్రం ఆ అంశంపై ఎలాంటి ఆసక్తి లేదని, అవి పెరిగినా, పెరగకపోయినా ఒకటేనని అంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
చిన్నరాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు చట్టం చేసినప్పుడు ఏం చేశారంటే .. కొన్ని సీట్లు పెంచితే సుస్థిరంగా ఉంటుందని భావించారు. ఈ రోజు సీట్ల సంఖ్య పెరగకపోవడానికి ప్రధాన కారణం జైరామ్ రమేశ్ యొక్క అజ్ఞానం. నాడు డ్రాఫ్ట్ రాసింది ఈ మొగోడే అంటూ కాస్త ఘాటుగానే చురకలు అంటించాడు. నాట్ విత్ స్టాండింగ్ 170 కు బదులు ‘విత్ స్టాండింగ్ 170’ అని జైరామ్ పేర్కొనటం వల్లే కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కేంద్రం స్పష్టం చేస్తోందని వివరించాడు. ‘మొన్న ప్రధానమంత్రిని కలిసినప్పుడు చెప్పాను.. సీట్ల సంఖ్య పెంచుతామంటే పెంచండి, లేకపోతే లేదు అని. అంతేకానీ, ముసుగులో గుద్దులాట మంచిదికాదు అని కోరాను. దానికి ఆయన ఇచ్చిన బదులును బట్టి సీట్ల సంఖ్య పెంచడం లేదని నాకు అర్థమైంది అని కేసీఆర్ వెల్లడించాడు.
మరోపక్క పోలీసు శాఖ వాహనాలు కొనుగోలుకు సంబంధించి అక్రమాలు అంటూ జైరామ్ చేసిన వ్యాఖ్యలపైనా కేసీఆర్ స్పందించాడు. ఏం తెలియకుండా జైరాం రమేష్ మాట్లాడుతున్నారని, చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపని పక్షంలో ఆయన ముక్కునేలకు రాయాలని అన్నారు. ఆ పార్టీ వాళ్లు(కాంగ్రెస్) చేసిన తప్పులు తాము కూడా చేస్తామని ఆయన అనుకుంటున్నారేమో అంటూ సెటైర్ వేశాడు. జైరామ్ రమేశ్! కనీసం సర్పంచ్ గానైనా ఎప్పుడైనా పోటీ చేసి గెలిచారా?, ‘రాజ్యసభ బగ్’ అంటూ ఆయనపై కేసీఆర్ మండిపడ్డాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more