బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి పంచన చేరడం దారుణమని అన్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమేనన్నారు. నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలను, మహాకూటమిని మోసం చేశారని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ ఏం లాభాన్ని అశించి బీజేపితో జతకట్టారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం మార్పిడి కోసం నితీష్, బీజేపితో కలసి గత మూడు నాలుగు నెలలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారన్న విషయం తమకు తెలుసునని వ్యాఖ్యానించారు.
బీహార్ ముఖ్యమంత్రిగా మరోమారు నితీశ్ ప్రమాణం చేసిన వెంటనే రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..నితీశ్ కుమార్ మోసానికి మరుపేరుగా నిలిచారని మండిపడ్డారు. ఇలా చేస్తున్నారన్న విషయాలు తెలిపిన వెంటనే ఢిల్లీకి వచ్చిన ఆయనతో తాను సమావేశమయ్యానని చెప్పారు. అయితే నితీశ్ తనతో సమావేశం అయినప్పుడు ఆయన స్పందన వేరేగా ఉందని కానీ ఇప్పుడు ఆయన అనూహ్య నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమెంచ్చిందని ప్రశ్నించారు.
మతోన్మాద శక్తులు అధికారంలోకి రాకుండా, అందుకు వ్యతిరేకంగా నిలబడేందుకు బీహార్ ప్రజలు ఆయనకు సీఎం పదవిని కట్టబెడితే ఆయన వారిపంచన చేరడాన్ని ప్రజలు ఎలా సమర్థిస్తారని రాహుల్ ప్రశ్నించారు. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఆయన తన పయనాన్ని సాగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు కేవలం అధికారం కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లడం ఆక్షేపనీయం కాదా..? ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చ కాదా..? అని రాహుల్ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more