TRS Rajya Sabha MP KK Hospitalised

K keshava rao hospitalised

K. Keshava Rao, MP K. Keshava Rao, Rajya Sabha MP K. Keshava Rao, Rajya Sabha MP Hospitalized, TRS MP Hospitalised, KK Hospitalised,

Rajya Sabha MP K. Keshava Rao hospitalised. Family Members admitted in NIMS.

టీఆర్ఎస్ ఎంపీకి అస్వస్థత

Posted: 07/21/2017 08:30 AM IST
K keshava rao hospitalised

తెలంగాణ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు స్వల్ప అస్వస్థత కలిగింది. దీంతో వెంటనే ఆయన్ను నిమ్స్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఒక్కసారిగా ఆయన అనారోగ్యంతో కుప్పకూలినట్లు తెలుస్తోంది.

దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఆయనను పరామర్శించేందుకు పలువురు టీఆర్ఎస్ నేతలు నిమ్స్ కు క్యూ కడుతున్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే, కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోసారి ఆయన రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అధిష్టానం అడ్డుకుంది. ఆ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి... సెక్రటరీ జనరల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా, మియాపూర్ ల్యాండ్ మాఫియాలో గోల్డ్ స్టోన్ కు సంబంధించిన భూములను ఈ టీఆర్ఎస్ ఎంపీ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావటం, ఆయన ఖండించటం తెలిసిందే. తాము చట్ట ప్రకారమే ఆ భూములను కొనుగోలు చేశామని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి కేకే మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  MP Keshava Rao  Hospitalised  

Other Articles