పిల్లలు ఏదైనా తప్పు చేసినా.. కేవలం కాలయాపన కోసం పనులు చేసినా వాటితో జరిగే అనర్థాలు మాత్రం చాలా వుంటాయి. అయితే ఈ పనులతో వారికి ఫైసా లాభం లేకపోయినా.. అవతలివారికి మాత్రం నష్టం సంభవించక తప్పదు. ఇలాంటి పనులు చేసినప్పుడు పెద్దలు ఒరేయ్ కొతి చేష్టలు చేశావో.. తాట తీస్తా అని హెచ్చరిస్తుంటారు. అసలు కోతి చేష్టలంటే.. ఏమిటీ.. కావాలని కాకుండా సరదాగా చేసిన పనులకు కూడా తిట్టేస్తారా.. అంటూ పిల్లలు మనోవేధనకు గురవుతుంటారు.
అయితే ఇవి నిజంగా కొతి చేష్టలే అని పెద్దలు కసురుకుంటారు. నిజంగా కొతులు చేసే చేష్టలు ఇలాగే వుంటాయని మరో మర్కట మారాజు నిరూపించాడు. అదెలా అంటారా...? తాను సరదాగా ఓ విద్యుత్ తీగతో అడుకుని దానిని తెంచేవరకు ఊగాడు. ఇక అది తెగంగానే తన దారిన తాను వెళ్లాడు. అయితే దీంతో గుంటూరు జిల్లా రైల్వే అధికారులకు పెద్ద సమస్యే తలెత్తింది. విద్యుత్ తీగ తెగిన మార్గంలో ఎక్కడి రైళ్లను అక్కడి నిలిపేసి వేగంగా మరమ్మతు పనులు చేపట్టాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం రైల్వే గేటు వద్ద ఓ కోతి విద్యుత్ స్తంభం ఎక్కి గంతులు వేయడంతో, ఓ తీగ తెగి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పై పడింది. దీంతో నడికుడి - విజయవాడ లైన్ లో విజయవాడకు ముందు వచ్చే కృష్టా కెనాల్ జంక్షన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఫ్యూజ్ పోయింది. విషయం తెలుసుకున్న అధికారులు గేటు వద్ద విద్యుత్ తీగలు తెగాయని, మరమ్మతులు చేపట్టారు. ఈ లోగా కేరళ ఎక్స్ ప్రెస్ ను పెదవడ్లపూడిలో, బిట్రగుంట ప్యాసింజర్ రైలును దుగ్గిరాలలో నిలిపివేశారు. మిగతా రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయాల్సి వచ్చింది. పనులు పూర్తయిన తరువాత రైళ్ల రాకపోకలకు యధావిధిగా కొనసాగించారు. అయితే ఇక్కడ మాత్రం విద్యుత్ తీగతో అడిన కోతి విద్యుధ్ఘాతానికి గురై మరణచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more