ప్లీనరీ వేదికగా నవరత్నాలను ప్రకటించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ వెంటనే అక్టోబర్ 27 నుంచి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే. అందరికి మంచి కాలం దగ్గర ఉందని చెబుతూ పనిలో పనిగా ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరికను మరోసారి ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలో జగన్ పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
తమ పార్టీ అధినేత చంద్రబాబుకు.. సోమవారం పోలవారం అయితే, జగన్ కు.. శుక్రవారం కోర్టువారం అని సెటైర్ వేశాడు. జగన్ తన పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతి శుక్రవారం విరామం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఎందుకంటే, అక్రమ కేసుల విచారణ విషయమై ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది కదా? అని తెలిపాడు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ప్రభుత్వం, సీఎం పని చేస్తుంటే.. సహకరించాల్సింది పోయి పదే పదే విమర్శలతో పెద్ద తలనొప్పిగా తయారవుతున్నాడంటూ మండిపడ్డాడు.
పదహారు నెలల జైలు జీవితం గడిపిన జగన్ ఎలా నవ్వుతున్నాడో అర్థం కావడం లేదని టీడీపీకి చెందిన మరో నేత బండారు సత్యనారాయణ తెలిపాడు. జగన్ మనిషా? మానవమృగమా? అంటూ ఘాటుగా విమర్శించాడు. జగన్ సోదరి షర్మిల గురించి తాను మాట్లాడబోనని, తనకు చెల్లెలితో సమానమని, అంతగా కావాలంటే, యూట్యూబ్ లో వెతికితే ఆమె గురించిన సమాచారం దొరుకుతుందంటూ సెటైరిక్ గా విమర్శలు చేశాడు.
రోజానే తాగుబోతు...
వైసీపీ ఎమ్మెల్యే రోజా.. కేబినెట్ మంత్రులంతా తాగుబోతులని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డాడు. హాఫ్ బాటిల్ తాగితే తప్పా రోజాకు నిద్రపట్టదని, అలాంటి రోజా తమను విమర్శించటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించాడు. టీడీపీ నుంచి రోజా వెళ్లిపోయిన తరువాత తాము అధికారంలోకి వచ్చామని, వైసీపీలో రోజా ఉంటే .. జగన్ శాశ్వతంగా జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more