భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీనిచ్చే సత్తా ఉన్న జట్టుగా జేడీయూ, ఆర్జేడీ మరియు కాంగ్రెస్ కు మంచి పేరు ఉంది. బీహార్ లో మోదీ ఛరిష్మాను తట్టుకుని మరీ అధికారంలోకి వచ్చింది మహాకూటమి. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాలు వీరు విడిపోవటానికి కారణమవుతుండటంతో హడావుడిగా రంగంలోకి దిగింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.
తాజాగా ఆ ఇరువురు నేతలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. విడిపోకూడదని ఇరువురు నేతలకు సూచించిందంట. కేంద్రం ఉచ్చులో పడొద్దని నితీశ్ కు, మరోవైపు ఓపికతో ఉండాలని లాలూను ఆమె కోరిందంట. ఆ ఇద్దరు నేతలు కొన్ని రోజుల్లో అన్ని సమస్యలూ తొలగిపోయి పరిస్థితులు చక్కబడతాయని సోనియాతో చెప్పినట్లు... కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి హరేంద్ర కుమార్ తెలిపాడు.
ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఇటీవల సీబీఐ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీతో విడిపోతారని వార్తలు వచ్చాయి. అయితే, నితీశ్ మాత్రం లాలూతో విడిపోయే సమస్యేలేదని పైకి చెబుతున్నప్పటికీ డిప్యూటీ సీఎం పదవి నుంచి లాలూ కొడుకు తేజస్వియాదవ్ ను తొలగించేందుకు సన్నాహాలు చేస్తూనే ఉన్నాడు.
అవినీతి ఆరోపణలు రావటం, పాలనపరంగా ఆర్జేడీతో పొసగకపోవటంతోనే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే దఫా కూడా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా తాను అధికారంలోకి రావాలంటే లాలూ కి గుడ్ బై చెప్పటం మంచిదన్న భావనలో బీహార్ సీఎం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ దౌత్యం ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more