టెలికాం రంగంలో మరో పెను సంచలనానికి రిలయన్స్ సిద్ధమైపోతుంది. ఇప్పటికే జియో పేరుతో ఓ కుదుపు కుదిపేసిన సంస్థ ఇప్పుడు తక్కువ రేటుకే 4జీ ఫోన్ ను ఇచ్చేందుకు ముందుకు రాబోతుంది. కేవలం రూ. 500కే వోల్టే పేరుతో ఫోను ను మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ నెల చివర్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
నిజానికి గతంలోనే ఈ ఫోన్ పై కొంత సమాచారం బయటకు పొక్కగా, ధర రూ. 1500 వరకూ ఉండొచ్చని భావించారు. అయితే, దిగువ తరగతి మార్కెట్ పై కన్నేసిన సంస్థ అధినేత ముఖేష్ కేవలం రూ. 500కే అందించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బ్రోకరేజ్, ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ దీనిపై ప్రకటన చేయొచ్చని సమాచారం. ఇదే సమయంలో ఈ నెలతో ముగియనున్న ధనా ధన్ ఆఫర్ స్థానంలో మరో ఆకర్షణీయ కొత్త ప్లాన్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే 4జీ సేవలను ప్రారంభించి, ఉచిత వాయిస్, డేటా సేవలంటూ, ప్రత్యర్థి టెలికం కంపెనీలకు కునుకు లేకుండా చేసిన రిలయన్స్ ఈ ప్రకటనతో మరెంత దూసుకుపోతుందో చూడాలి. కాగా, ప్రస్తుతం 2జీ ఫోన్లను వాడుతున్న మార్కెట్ ను 4జీ వైపు కదిలించడమే తన లక్ష్యంగా ముఖేష్ వేస్తున్న అడుగులు, ఎయిర్ టెల్ తో పాటు ఐడియా తదితర సంస్థల రూరల్ మార్కెట్ పై పెను ప్రభావాన్ని చూపవచ్చని హెచ్ఎస్బీసీ డైరెక్టర్ రాజీవ్ శర్మ అంచనా వేస్తున్నారు.
డేటాలో ముంచెస్తోంది...
రిలయన్స్ జియో తన జియోఫై రూటర్ను కొత్తగా కొనుగోలు చేసే వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ప్రస్తుతం జియోఫై రూటర్ను, దాంతోపాటు కొత్త జియో సిమ్ను తీసుకుంటే యూజర్లకు భారీ మొత్తంలో ఉచితంగా 4జీ డేటాను అందిస్తోంది. అందుకు ఏం చేయాలంటే ముందుగా జియో ఫై రూటర్ కొనాల్సి ఉంటుంది. దాని ఖరీదు రూ.1,999గా ఉంది. కొత్తగా తీసుకున్న జియో 4జీ సిమ్ను వేశాక రూ.99 ప్రైమ్ మెంబర్షిప్ రీచార్జి చేసుకోవాలి. అనంతరం రూ.509తో రీచార్జి చేసుకుంటే యూజర్లకు 224 జీబీ 4జీ డేటా ఫ్రీగా వస్తుంది. దానికి వాలిడిటీ 112 రోజులు ఉంటుంది. రోజుకు గరిష్టంగా 2జీబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చు.
ఇక రూ.509 కాకుండా రూ.149, రూ.309, రూ.999 ప్యాక్లకు కూడా ఉచిత డేటాను యూజర్లు పొందవచ్చు. రూ.149తో రీచార్జి చేసుకుంటే ఏడాది పాటు నెలకు 2 జీబీ డేటా లభిస్తుంది. రూ.309తో రీచార్జి చేసుకుంటే 168 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 168 జీబీ డేటా లభిస్తుంది. రూ.999 ప్యాక్ను రీచార్జి చేసుకుంటే 120 జీబీ డేటా లభిస్తుంది. దీనికి రోజువారీ లిమిట్ లేదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ 56 రోజుల వాలిడిటీ మాత్రమే ఉంటుంది. నూతనంగా రిలయన్స్ జియోఫై రూటర్, సిమ్లను కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more