హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఇవాళ మరో నలుగురిని అరెస్టు చేశామని, దీంతో ఇప్పటివరకూ మొత్తం ఏడుగురు అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి అరెస్టులు జరిగాయని తెలిపారు. అయితే ఇవాళ అరెస్టైయిన నిందితులు అందరూ సాప్ట్ వేర్ ఉద్యోగులేనని చెప్పారు. ఇప్పటివరకు 100 ఎల్ ఎస్ డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
కాగా డ్రగ్స్ మాఫియా అమాయక స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేసిందన్న విషయం తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో 1200 మందికి పైగా విద్యార్థుల పేర్లు ఉన్నాయని తెలిపారు. అయితే విద్యార్థులు పేర్లను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయటపెట్టరని చెప్పిన ఆయన.. డ్రగ్స్ రాకెట్ లో చిక్కుకున్న విద్యార్థులు అందోళన చెంది ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని విన్నవించారు. అయితే డ్రగ్స్ మాఫియాలో చిక్కుకున్న విద్యార్థుల పేర్లను సంబంధిత పాఠశాలల్లో ప్రిన్సిపాల్ లకు అందజేశామని అన్నారు.
వీరిలో ఒకే పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు వున్నట్లు కూడా చెప్పారు. వీరంతా 200కు పైగా వాట్స్ యాప్, టెలిగ్రాం యాప్ లను నిర్వహిస్తూ, మాట్లాడుకుంటున్నట్టు గుర్తించామన్నారు. వారి భవిష్యత్తు దృష్ట్యా, కనీసం విచారణకు కూడా పిలువబోమని తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయించే ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థుల్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని, ఇంకా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి వివరాలు విద్యార్థుల వద్ద ఉంటే వారు తమకు సమాచారాన్ని అందిస్తే, గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more