హంగులు, ఆర్భాటాలు లేకుండానే భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. వైట్ హౌజ్ లో సోమవారం(మంగళవారం పొద్దున) అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్, అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపాడు. వైట్హౌస్లో తనకు దక్కిన అపూర్వ ఆదరణ 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని అభివర్ణించాడు. అగ్రరాజ్యం బలంగా ఉంటేనే భారత్ లాభపడుతుందని మోదీ వ్యాఖ్యానించాడు.
ఇక అంతకు ముందు మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించాడు. మోదీ ఓ గొప్ప ప్రధాని అంటూ కొనియాడాడు. దేశంలో ఆర్థికాభివృద్ధిని తీసుకొచ్చారన్నాడు. అయితే భారత్-అమెరికా మధ్య సంబంధాలు గతంలో ఎప్పుడూ దృఢంగా, గొప్పగా లేవని ట్రంప్ ప్రస్తావించటం విశేషం. ఇక వాణిజ్య ఒప్పందాలతోపాటు ఆఫ్ఘనిస్థాన్ సహా పలు ప్రాంతీయ సమస్యలపై ఇద్దరూ చర్చించారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, దాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తామని ప్రతినబూనారు.
పాక్ కు షాక్...
మోదీ-ట్రంప్ మీటింగ్కు కొన్ని గంటల ముందు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించిన అమెరికా మోదీకి ఘన స్వాగతం పలికింది. తద్వరా పాకిస్థాన్ కు మరో షాకిచ్చినట్లు అయ్యింది. ఇంతకు ముందు ఆర్మీ గ్రాంట్స్ ను రుణం కింద జమచేస్తున్నట్లు ప్రకటించి పెద్ద షాకే ఇచ్చింది.
మెలానియా ఎట్రాక్షన్...
మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో మెలానియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెలానియా ధరించిన దుస్తులు అందరినీ ఆకర్షించాయి. స్వతహాగా కురచ దుస్తులు, మోడ్రన్ దుస్తులు ధరించే మెలానియా మోదీకి ఆహ్వానం సమయంలో పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న పొడవైన డ్రెస్ (పుక్కి) ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా మోడ్రన్ డ్రెస్సులు ధరించే మెలానియా, ఇప్పుడు అందుకు భిన్నంగా పాదాలు కూడా కనిపించని పుక్కి ధరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు మన దగ్గరి భామలు రెచ్చిపోయి స్కర్ట్ లు వేసుకుని ప్రధానిని కలుస్తుంటే.. ఓ విదేశీ మహిళగా మెలానియా కంప్లీట్ గా కప్పుకున్న డ్రస్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
వైట్హౌస్లో విదేశీ నేతకు ట్రంప్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. తద్వారా మోదీకి ట్రంప్ ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 2014లో ఒబామా హయాంలో మోదీ అమెరికాలో పర్యటించినప్పటికీ వైట్హౌస్లో ఆయన విందుకు హాజరు కాలేదు. అప్పట్లో మోదీ నవరాత్రి ఉపవాస దీక్షలో ఉండడమే కారణం.
నెక్స్ట్ నెదర్లాండ్...
ఇక అమెరికాలో పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం నెదర్లాండ్స్ బయలుదేరారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన చివరిగా నెదర్లాండ్స్లో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధాని మార్క్ రుట్తో సమావేశమై ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై చర్చించటంతోపాటు పలు కంపెనీల సీఈవోలతో సమావేశమై భారత్లో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more