ఆర్జే స్టూడియో బ్యూటీషియన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి సూసైడ్ కు సంబంధించి రోజు కొత్త విషయం వెలుగు చూస్తున్న నేపథ్యంలో క్రమక్రమంగా కేసును పూర్తిగా పక్క దారి పట్టిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా అసలు ప్రభాకర్ రెడ్డి వేధించాడా? లేక అత్యాచారమే చేశాడా? అసలు హత్యాచారం జరిగిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఉరి వేసుకున్న విధానం, ఇన్నర్ వేర్ పై మరకలు, అత్యాచారం జరిగిందన్న కోణం, అసలు ఆమె కుకునూరుపల్లిలోనే చనిపోయిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శిరీష బాబాయ్ శ్రీనివాసరావు కూడా ఇదే అభిప్రాయం చేస్తున్నాడు కూడా.
శిరీష తన భర్తకు వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసిన సమయం 1.58 గంటలుగా పోలీస్ కమిషనర్ పేర్కొన్నారని, అది కరెక్టు కాదని అన్నారు. ఆ లొకేషన్ ను పరిశీలిస్తే పోలీస్ క్వార్టర్స్ ను కాకుండా, అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని లొకేషన్ ను చూపిస్తోందన్నాడు. అసలు వాళ్లు పోలీస్ క్వార్టర్స్ కు వెళ్లలేదని, ఓ రిసార్ట్స్ లో వీళ్లందరూ కలుసుకుని ఉంటారని చెబుతున్నాడు. అంతేకాదు శిరీష తలపై గాయం ఆమెను జుట్టు పట్టుకుని లాగితే అయింది కాదని, బలంగా తలపై కొట్టడం వల్లే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.
వారి నుంచి తప్పించుకునే క్రమంలో కారు దిగి పారిపోయిందని, ఈ క్రమంలో తన లొకేషన్ ను భర్తకు షేర్ చేసి ఉండొచ్చనన్నాడు. పారిపోయిన శిరీషను పట్టుకుని బలంగా కొట్టి చంపారని, రాజీవ్, శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కలిసి ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అంటున్నాడు. అసలు ఈ కేసు విచారణే అసలు సరిగ్గా లేదని, శిరీష వ్యవహారంలో ఏదో దాస్తున్నారని, అసలు వాస్తవాన్ని పోలీసులు ప్రపంచానికి వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నాడు.
రాజీవ్ కు తెలిసే అంతా..
శ్రవణ్, ఎస్సై ప్రభాకర్ రెడ్డితో మాట్లాడిన కాల్స్ సంఖ్యను కూడా పోలీసులు గుర్తించారు. ఈ కాల్స్ లో ‘అన్నా! శిరీష లీడింగ్ బ్యుటీషియన్. ఆమెకు ఫేవర్ చేస్తే మనకు భవిష్యత్ లో బాగా పనికొస్తుంది. శిరీషను తీసుకొస్తా, మీరు చూసి డిసైడ్ చేయండి’ అంటూ ఎస్సైతో చెప్పిన ఆధారాలు సేకరించారు. అదే సమయంలో శ్రవణ్, రాజీవ్ తో ‘శిరీషను వదిలించుకోవడం నీకు ఇష్టమేనా? ఇందుకు ఎస్సైకి కొంత ఫేవర్ చేయాలి’ అని శ్రవణ్ ముందుగానే చెప్పినట్టు తెలుస్తోంది.
తేజస్వినిని పెళ్లిచేసుకోవాలన్న ఆలోచనతో రాజీవ్, శిరీషను వదిలించుకునేందుకు సిద్ధపడి, ఎస్సైకి సహకరించినట్టు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఏదో జరిగిందని, ఏం జరిగిందన్నది రాబట్టేందుకు వారిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని వారు న్యాయస్థానాన్ని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more