దేశ వ్యాప్త అదాయపన్నుదారులను ఎంతో ఉత్కంఠకు గురిచేస్తున్న అంశం లింక్. అధార్ కార్డును అదాయ అంశాలతో ముడిపెట్టి లింక్ చేయడంపై కేంద్రం తీసుకువచ్చిన తాజా సవరణలకు చెక్ పడింది. ఈ విషయంలో కేంద్రానికి మరోమారు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఓటరు కార్డుతో అధార్ కార్డును లింక్ చేయాలని కేంద్ర ఉత్తర్వులు జారీ చేసినప్పడు కూడా కేంద్రానికి ఇలాంటి ఝలకే తగిలింది. అయినా తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఆధార్ కార్డును అన్నింటితో లిక్ చేయాలని మోడీ సర్కార్ భావించింది.
ఆదార్ కార్డుతో ప్యాన్ కార్డును లింక్ చేసే అంశంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా స్టే విధించింది. జస్టిస్ ఏకే సిక్రీ, అశోక్ భూషన్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఈ మేరకు ఇవాళ ఇరువర్గాల వాదనలను విన్న తరువాత అధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలువరింపజేసింది. అంతేకాదు అదాయపన్ను రిటన్స్ చెల్లింపులలోనూ ఇది తప్పనిసరి కాదని చెప్పింది.
ఈ మేరకు దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రజలను బలవంతంచేయడం తగదని సూచించింది. ఆధార్ లేకపోయినా కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి ఐటీ రిటన్స్ దాఖలు చేసే సమయంలో అధార్ నెంబర్లను పొందుపచ్చాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో అధార్ తో పాన్ కార్డును లింక్ చేయరాదని చెప్పిన న్యాయస్థానం.. పౌరుల వ్యక్తిగత వివరాలు జాగ్రత్తగా భద్రపర్చేందుకు కొత్త విధానం కోసం కేంద్రం కసరత్తు చేయాలని అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more