కోట్ల రూపాయల వ్యయం(180 కోట్లు పైమాటే).. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఉన్న కంపెనీలు(షాపూర్జీ, ఎల్ అండ్ టీ) కట్టిన నిర్మాణం.. ఒక్క వర్షానికే డ్యామేజీ, నీటి లీకేజీ. ఇది అమరావతి సాక్షిగా కొత్త సచివాలయంలో చోటు చేసుకున్న వైనం. నల్లరేగడి నేలలో నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదంటూ తొలినాటి నుంచే వాదిస్తున్న వస్తున్న ప్రతిపక్ష వైసీపీ చేతికి పదునైన ఆయుధం దొరికినట్లయ్యింది. పోయి పోయి అధినేత జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ లోనే జరగటంతో ఇష్యూ మరింత సీరియస్ అవుతోంది.
నిజానికి నిర్మాణాల్లో అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని గతంలో చంద్రబాబు చాలా సార్లు చెప్పుకొచ్చాడు. అలాంటప్పుడు ఇంత త్వరగా ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొందన్నది పలువురి ప్రశ్న. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. జగన్-ఛాంబర్ విషయంలోనే ఇప్పటిదాకా చాలాసార్లు విమర్శలు వచ్చాయి. తొలినాళ్లలో అసెంబ్లీ ప్రారంభం తర్వాత అసలు జగన్ కు ఛాంబర్ కేటాయించలేదు. తర్వాత టాయ్ లెట్ పక్కన ఇచ్చారన్న మరో విమర్శ. ఇప్పుడేమో.. జగన్ ఛాంబర్ నుంచే వర్షం లీకేజీ అవ్వటం.
భారీ వర్షం కారణంగా సెక్రటేరియట్ లోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. కానీ, జగన్ కార్యాలయంలోకి మాత్రం పై నుంచి నీరు సన్నటి ధారగా కారింది. అయితే, వర్షపునీరు చేరడానికి కిటీకీలు తెరిచిఉండడమే కారణమని సిఆర్డీఎ కమిషనర్ శ్రీధర్ చెబుతుండగా, పైకప్పు దెబ్బతినడం వల్ల జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీరు వచ్చిందన్నది అసలు మ్యాటర్. ఏది ఏమైనా చిన్న వర్సానికే అసెంబ్లీ ప్రాంగణం గోడ కూల్చేసి నీటిని బయటకు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు మీడియాను లోపలికి తీసుకెళ్లి మొత్తం వ్యవహారాన్ని, లోపలి పరిస్థితులను కవరేజీ చేయించేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more