అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఉగ్రచర్యతో మరోసారి రక్తమోడింది. ఈ ఉదయం భారీ పేలుడు సంభవించి 50 మంది మృతి చెందారు. ఇండియన్ ఎంబసీ కి అతి సమీపంలో ఈ కారు బాంబు దాడి సంభవించింది. దీంతో భారత్ లోని వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది.
అయితే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దాడిలో అధికారులు అంతా సురక్షితంగా ఉన్నారంటూ తన ట్విట్టర్ లో పేర్కొంది. దేవుడి దయ వల్ల ఈ ప్రమాదంలో భారత్ కు చెందిన అధికారులెవరికీ ఏం కాలేదని, అక్కడి వారంతా సురక్షితంగా ఉన్నారంటూ తెలిపింది.
By God's grace, Indian Embassy staff are safe in the massive #Kabul blast.
— Sushma Swaraj (@SushmaSwaraj) May 31, 2017
దాడి జరిగిన తర్వాత ఒక్కసారిగా నగరం మొత్తం పొగ అలుముకుంది. ఉగ్రవాదుల టార్గెట్ ఏంటో స్పష్టంగా తెలీకపోయినప్పటికీ ప్రెసిడెంట్ భవనం, ఆ చుట్టుపక్కలే పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉండటంతో భారీ నష్టం చేసేందుకే ఈ దాడి జరిగినట్లు స్పష్టం అవుతోంది. పేలుడు దాటికి చుట్టుపక్కల కిలోమీటర్ మేరలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దాడికి కారకులంటూ ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించకపోయినా, తరచూ దాడులు నిర్వహించే తాలిబన్ సంస్థే కారణం అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
గత మూడు నెలల్లో వరుసగా 5 దాడులు జరగ్గా.. మే 3న నాటో భద్రత దళాలపై చేసిన దాడిలో 8 మంది మృత్యువాత పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more