ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి శభాష్ అనిపించుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఇంకో సంచలనానికి రెడీ అయిపోతున్నాడు. బాల్య వివాహాలు, వరకట్న దురాచారంపై సమర భేరి మోగించేందుకు గాంధీ జయంతిని వేదిక చేసుకోబోతున్నాడు. అక్టోబర్ 2 నుంచి వాటికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించాడు.
మహిళల కోరిక మేరకు మద్య నిషేధం విధించిన ముఖ్యమంత్రి ఇటీవల ప్రజలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం ‘లోక్ సంవాద్’ సందర్భంగా ఓ మహిళతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాట్నాలో నిర్వహించిన మహావీర్ వత్సాలయ కేన్సర్ ఆసుపత్రి 11వ వ్యవస్థాపక దినోత్సంలో పాల్గొన్న నితిశ్ కుమార్ మాట్లాడాడు. బాల్యవివాహాలపై ఓ మహిళ జరుపుతున్న ప్రచారం తనకు స్ఫూర్తినిచ్చిందని నితిశ్ పేర్కొన్నారు.
2005లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, సామాజిక దురాచారాలపై యుద్ధంతోపాటు ఆడపిల్లల రక్షణ, నిషేధం, డి-అడిక్షన్, మహిళా సాధికారత వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు వివరించాడు. మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని, త్వరలోనే వాటిపైనా దృష్టి సారిస్తామని నితిశ్ పేర్కొన్నాడు. అన్ని రంగాల్లో వెనుకబడిన బీహార్ ను టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపేందుకే తాను కృషి చేస్తానని వెల్లడించాడు.
ఇక మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొందరు అధికారులు సీజ్ చేసిన మందు బాటిళ్లను స్వాహా చేయటం నితీశ్ కు ఆగ్రహాం తెప్పించింది. ఎలుకల పేరు చెప్పి లక్షల్లో మందు సీసాలను ఖాళీ చేయటంపై విచారణ కొనసాగుతుండగానే సీజ్ చేసిన బాటిళ్లను రోడ్డు రోలర్ తో తొక్కించేసి నాశనం చేయాలని అధికారులను ఆదేశించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more