ప్రేమించానని మోసం చేయటం, ఆపై బాధితులు తమ జీవితాలను తృణప్రాయంగా వదిలేస్తుండటం.. మరి శాడిస్టులైతే అవతలి వారిని టార్చర్ పెట్టడం లాంటి వ్వవహారాలు కొత్తేం కాదు. కానీ, తనని తనని కాకుండా వేరే యువతిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న యువకుడిపై ఓ యువతి దారుణంగా పగ తీర్చుకున్న ఘటన గుంటూరులో జరిగింది.
తాడికొండ మండలం పాములపాడుకు ఇలియాజ్ అనే యువకుడు ఐదేళ్ల క్రితం డిగ్రీ చదివే సమయంలో ఓ యువతిని ప్రేమించాడు. నాలుగేళ్లు వారి ప్రేమ కొనసాగాక బోర్ కొట్టి యువతిని వదిలేశాడు. ఆపై పెదకాకానికి చెందిన రోజ్ మేరీ అనే మరో యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. సోమవారం (మే 22న) వాళ్ల పెళ్లి ఓ మసీదులో ఘనంగా జరిగింది. ఇక విషయం తెలిసిన మొదటి ప్రేయసి పగతో రగిలిపోయింది.
ఇలియాజ్ స్నేహితుడు ఖాసింకు ఫోన్ చేసి, తాను ఇలియాజ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇప్పించాలని బతిమాలింది. ఇదే విషయాన్ని ఖాసిం ఇలియాజ్ తో చెప్పి ఫోటోలు ఇప్పించే ఏర్పాటు చేశాడు. ఈ లోపు అత్తింటివారికి చేరుకున్న ఇలియాజ్ కు స్వయంగా ఫోన్ చేసిన మాజీ ప్రేయసి కలవాలని ఉందంటూ పిలిచింది. వెంటనే ఇలియాజ్ హుటాహుటిన బయలుదేరాడు. ఆపై సాయంత్రం 3 గంటల సమయంలో కొందరు స్థానికులు ఇలియాజ్ సోదరుడికి ఫోన్ చేసి, యాసిడ్ దాడి జరిగిందని కబురు అందించారు. తాను ప్రేమించిన యువతి తనపై యాసిడ్ దాడి చేసిందని, తాను ఎక్కువ సేపు బతకనని చెబుతూ మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు ఇలియాజ్. ఇలియాజ్ స్నేహితుడు ఖాసింను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు యువతి సింగిల్ గానే ఈ పని చేసి ఉండదని అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more