ఎంసెట్ 2017 ఫలితాలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం ఉదయం జేఎన్టీయూ హైదరాబాద్ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ర్యాంకులను విడుదల చేశాడు. ఇంజనీరింగ్ లో 74.75 శాతం, వైద్య విద్య(అగ్రికల్చర్, ఫార్మసీ) లో 86.49 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించారు . కాగా, తెలంగాణ ఎంసెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ విభాగాల్లో ఆంధ్రా విద్యార్థులు హవా చాటారు. ఇంజనీరింగ్ టాప్-10లో ఆరు ర్యాంకులు, అగ్రి, ఫార్మసీ విభాగాల్లో మొదటి 10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు సాధించారు.
గుంటూరుకు చెందిన జయంత్ హర్ష (156 మార్కులు) తొలి ర్యాంకు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాంప్రసాద్ (156 మార్కులు) రెండో ర్యాంకు. మూడో ర్యాంకు భరద్వాజ్ (155 మార్కులు), తూర్పు
గోదావరి జిల్లా కు చెందిన శైలేంద్ర (155 మార్కులు) నాలుగో ర్యాంకు. అనంతపురం జిల్లాకు చెందిన దిలీప్ కుమార్ (155 మార్కులు) ఆరో ర్యాంకు. కృష్ణా జిల్లాకు చెందిన అబ్దుల్ మూయిజ్ (154
మార్కులు) తొమ్మిదో ర్యాంకు కైవసం చేసుకున్నారు.
మే 12న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ఇంజనీరింగ్ విభాగంలో 1,41,190 మంది దరఖాస్తు చేసుకోగా, 1,39,100 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 79,061
మంది దరఖాస్తు చేసుకోగా, 73,601 మంది పరీక్ష రాశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ రాయాల్సి ఉండటంతో రాష్ట్రాల్లో ఆ కోర్సులకు పరీక్షను ఎంసెట్
నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ఈ నెల 24 నుంచి 26 వరకు ఓఎంఆర్ షీట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు. ఫలితాల కోసం https://eamcet.tsche.ac.in , http://tsche.cgg.gov.in వెబ్ సైట్ పాస్ వర్డ్ technology@JNTUH అని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more