టాలీవుడ్ స్టార్ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ ఖాతాను హ్యాకర్లు బ్లాక్ చేశారు. ఆయన పెట్టిన పోస్టులేవీ అభిమానులకు చేరడం లేదు. ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ పై సమాచార సాంకేతిక శాఖ నిపుణులను పవన్ కార్యాలయ సిబ్బంది సంప్రదిస్తోంది.
సాధ్యమైనంత త్వరలో పవన్ ఖాతాను తిరిగి అధీనంలోకి తీసుకుంటామని జనసేన వర్గాలు వెల్లడించాయి. కాగా, ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే పవన్, పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇది వాన్నా క్రై ప్రభావమా? లేక ఎవరైనా ఆకతాయి చేసిన యత్నామా? తెలియాల్సి ఉంది.
టీడీడీకి వాన్నా క్రై దెబ్బ.. నో డేంజర్
ప్రపంచం మొత్తాన్ని బెంబేలెత్తించిన ఉత్తరకొరియా లాజరస్ గ్రూప్ ర్యాన్సమ్ వేర్ వాన్నా క్రై బారిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పడింది. టీటీడీకి చెందిన సుమారు 30 కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడి హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సైబర్ దాడి కేవలం పరిపానలనా పరిమైన అంశాలకు సంధించిన కంప్యూటర్లకు మాత్రమే పరిమితం కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సైబర్ ఎటాక్ వల్ల భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. టీటీడీ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్ వేర్ ను వినియోగిస్తున్నప్పటికీ సైబర్ హ్యాకింగ్ కు గురికావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్ సాఫ్ట్ వేర్ ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన కారణంగా ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్ అటాక్ అంశం తెలియగానే ఆ కంప్యూటర్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించి, ఇతర కంప్యూటర్లకు ఆ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, భక్తులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more