లింగ బేధాలు, తారతమ్యాలు పట్టించుకోకుండా ఇప్పుడున్న జనరేషన్ ఫాస్ట్ గా దూసుకుపోతుంది. మూడో వర్గంగా భావించే ట్రాన్స్ జెండర్ లు మిగతా వారికి సమాజంలో గర్వంగా తలెత్తుకుని తిరగ గలిగే పనులు చేస్తున్నారు. ఆ మధ్య తమిళనాడులో ప్రితికా యాషిన్ అనే ఓ హిజ్రా ఇటీవలే ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన విషయం తెలిసిందే. దేశంలోనే మొట్ట మొదటి సారి ఎస్ఐ పోస్టును దక్కించుకున్న హిజ్రాగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రితికా తమిళనాడులోని ధర్మపురిలోని పోలీసు స్టేషన్లో పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తోంది కూడా.
ప్రితికా స్ఫూర్తితో ఈ సారి ఏకంగా 50 మంది హిజ్రాలు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 21న ఆ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల ఎంపిక రాత పరీక్షలు జరగనున్నాయి. సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కునే హిజ్రాలు ప్రితికా ఇచ్చిన స్ఫూర్తితో విద్య, ఉపాధి ద్వారా అభివృద్ధి బాటలో నడుస్తున్నారు.
డాక్టర్ అవ్వాలనుంది.. తారిక
16 ఏళ్ల వయసులో తారిక(అంతకు ముందు బాలుడు) ఇంట్లో చెప్పా చేయకుండా చెన్నైకి పారిపోయి వచ్చాడు. చిన్నప్పటి నుంచి అమ్మాయిల్లా బట్టలు వేసుకోవాలని, వారితో తిరగాలని ఇలాంటి కోరికలతో తన బాధలను పైకి చెప్పుకోలేక హిజ్రా గ్రూప్ లో కలిసిపోయాడు. అక్కడ తారికగా పేరు మార్చేసింది ఉద్యమకారిణి గ్రేస్ బాను. అంబట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది.
ఇప్పుడు తమిళనాడులో ఫ్లస్ టూ పూర్తి చేసిన మొదటి హిజ్రాగా తారిక హిస్టరీ క్రియేట్ చేసింది. నిన్న రిలీజ్ చేసిన ఫలితాల్లో 535 మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది. భవిష్యత్తులో డాక్టర్ అయి తీరతానని, హిజ్రాల గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని తన లాంటి వారికి పిలుపునిస్తోంది. హిజ్రాలంటే కేవలం బెదిరించి అడుక్కుతినేవారన్న భావన జనాల్లో ఉంది. కొందరు చేసే పనులు అలా ఉంటాయి. కానీ, మాకు గౌరవం ఉందని నిరూపించుకోవాలంటే ఇలా అన్ని రంగాల్లో రాణించాలి. అందుకు ప్రభుత్వం, ప్రజల సహకారం అవసరం అని గ్రేస్ భాను చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more