అనారోగ్యం బారిన పడినా.. కాంగ్రెస్ ఉనికిని చాటుకునే క్రమంలో అధినేత్రి సోనియాగాంధీ.. తీవ్రంగానే శ్రమిస్తున్నారు. గత కొన్నాళ్లుగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా వున్న అమె.. అనారోగ్యం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలోనూ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకోలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తన ఉనికి చాటుకోవాలంటూ ప్రస్తుతం రాబోతున్న రాష్ట్రపతి ఎన్నికలే సరైనవని అమె భావిస్తున్నట్లున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థిని నిలుపుతామని స్పష్టం చేసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపికి గట్టిపోటీనివ్వాలని భావిస్తున్నారు.
అందుకోసం అనారోగ్యం ఓ వైపు వేదిస్తున్నా లక్ష్యపెట్టని అధినేత్రి సోనియా గాంధీ.. మెల్లిగా పావులను కదుపుతున్నారు. బీజేపి వ్యతిరేక శక్లులన్నింటినీ ఏకం చేస్తూ.. అందరి మద్దతును సోనియా కూడగట్టుకునే పనిలో వున్నారు. ఇందులో భాగంగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మరాఠా రాజకీయ భీష్ముడు శరద్ పవార్ తదితరులను సోనియా ఇప్పటికే కలిశారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లను కలిశారు ఇక తాజాగా సోనియాగాంధీ అసుపత్రి నుంచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు.
సోమవారం ఢిల్లీ వస్తే.. ఒక సమావేశం నిర్వహించుకుందామని మమతతో సోనియా చెప్పినట్లు సమాచారం. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఎలాగైనా నిలబెట్టాలన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తుంది. అయితే సోమవారం రోజు మమత బెనర్జీతో సమావేశం జరిపి అమె మద్దతు కూడా కూడగట్టుకోవాలని సోనియా భావిస్తున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా బరిలో నిలుపుతామని బీజపి స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా శరవేగంగా పావులు కదుపుతుంది. గత రాష్ట్రపతి ఎన్నికలలో ఫీఏ సంగ్మాకకు మద్దతునిచ్చిన బీజేపి.. ఈ సారి కాంగ్రెస్ సహా ప్రత్యర్థి పార్టీల నుంచి మాత్రం తీవ్రపోటీని ఎదుర్కునే అవకాశాలున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more