మద్యం సేవించడం అరోగ్యానికి హానికరమని మద్యం బాటిల్ పైనే రాసివుంటుంది. దానిని లక్ష్యపెట్టకుండా సేవించే వారు విచిత్రమైన చర్యలకు, వికృతమైన చేష్టలకు పాల్పడుతుండటం కూడా మనం చూస్తూనేవుంటాం. కానీ బెంగుళూరులో ఓ వివాహిత మద్యం మత్తులో ఏకంగా భర్త ఉసురునే తీసేసేది. తాగిన మైకంలో తానేం చేస్తుందో కూడా తెలియని దశలో భర్తపై కాల్పులు జరిపింది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు భర్తను షూట్ చేసింది. అడ్డు వచ్చినవారిపై కూడా తుపాకీని ఎక్కు పెట్టి కాల్చివేస్తాను ఏమనుకుంటున్నారో అంటూ హెచ్చరించింది. ఈ ఘటనలో గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అయన పరిస్థితి ఇంకా విషమంగానే వుందని వైద్యులు చెబుతున్నారు.
బెంగళూరులోని హోస్సూరు రోడ్డులో హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హెచ్ఎస్ఆర్ లేఔట్లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. సాయిరామ్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్ రెసిడెన్సిలో సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు. మార్గం మధ్యలో కూతురి పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
వీరసంద్ర గేట్ సమీపంలోకి రాగానే భార్య పోరు పడలేక. భర్త సాయిరామ్ కారు దిగి బీఎంటీసీ బస్సు ఎక్కాడు. తన మాటను లెక్కచేయకుండా భర్త వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయిన భార్య. భర్త ఎక్కిన బస్సును ఓవర్ టేక్ చేసి దాని ముందర నిలపింది. భర్తను బలవంతంగా బస్సు నుంచి కిందకు దింపి రివాల్వర్తో మూడు రౌండ్ల కాల్పులు జరిపింది. దీంతో మూడు బుల్లెట్లు కడుపు, ఎద బాగంలో దూసుకెళ్లాయి. రస్తస్రావం అవతున్న భర్త అక్కడే కుప్పకూలాడు.
ఈ ఘటనను తీవ్రంగా అక్షేపించిన బస్సు ప్రయాణికులు, స్థానికులు ఆమెను నిలువరింపేందుకు యత్నించగా వారిపై రివాల్వార్ ఎక్కు పెట్టి మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్ను చికిత్స నిమిత్తం స్పర్శా ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన భార్యపై హత్యాయత్నం కింద కేసును నమోదు చేసిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more