Wife arrested for shooting husband thrice మద్యం మత్తులో వ్యాపారవేత్తపై భార్య దారుణం..

Wife shoots man thrice in car chases him as he escapes

Woman shoots husband, Murder in Bengaluru, inebriated business man shot by wife, wife chases husband, business man chased by wife and shot, business man shotup by wife, crime news, crime in bengaluru, Bengaluru police

A woman shot her husband as he drove their SUV down Hosur Road around 5pm on Friday. As the man, shot thrice in his abdomen, stumbled out and jumped into a BMTC bus to escape

మద్యం మత్తులో వ్యాపారవేత్తపై భార్య దారుణం..

Posted: 05/06/2017 05:14 PM IST
Wife shoots man thrice in car chases him as he escapes

మద్యం సేవించడం అరోగ్యానికి హానికరమని మద్యం బాటిల్ పైనే రాసివుంటుంది. దానిని లక్ష్యపెట్టకుండా సేవించే వారు విచిత్రమైన చర్యలకు, వికృతమైన చేష్టలకు పాల్పడుతుండటం కూడా మనం చూస్తూనేవుంటాం. కానీ బెంగుళూరులో ఓ  వివాహిత మద్యం మత్తులో ఏకంగా భర్త ఉసురునే తీసేసేది. తాగిన మైకంలో తానేం చేస్తుందో కూడా తెలియని దశలో భర్తపై కాల్పులు జరిపింది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు భర్తను షూట్ చేసింది. అడ్డు వచ్చినవారిపై కూడా తుపాకీని ఎక్కు పెట్టి కాల్చివేస్తాను ఏమనుకుంటున్నారో అంటూ హెచ్చరించింది. ఈ ఘటనలో గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అయన పరిస్థితి ఇంకా విషమంగానే వుందని వైద్యులు చెబుతున్నారు.

బెంగళూరులోని హోస్సూరు రోడ్డులో హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. సాయిరామ్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్‌ రెసిడెన్సిలో సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు. మార్గం మధ్యలో కూతురి పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

వీరసంద్ర గేట్‌ సమీపంలోకి రాగానే భార్య పోరు పడలేక. భర్త సాయిరామ్‌ కారు దిగి  బీఎంటీసీ బస్సు ఎక్కాడు. తన మాటను లెక్కచేయకుండా భర్త వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయిన భార్య.  భర్త ఎక్కిన బస్సును ఓవర్ టేక్ చేసి దాని ముందర నిలపింది. భర్తను బలవంతంగా బస్సు నుంచి కిందకు దింపి రివాల్వర్‌తో మూడు  రౌండ్ల కాల్పులు జరిపింది. దీంతో మూడు బుల్లెట్లు  కడుపు, ఎద బాగంలో దూసుకెళ్లాయి. రస్తస్రావం అవతున్న భర్త అక్కడే కుప్పకూలాడు.

ఈ ఘటనను తీవ్రంగా అక్షేపించిన బస్సు ప్రయాణికులు, స్థానికులు ఆమెను నిలువరింపేందుకు యత్నించగా వారిపై రివాల్వార్‌ ఎక్కు పెట్టి మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్‌ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్‌ను చికిత్స నిమిత్తం స్పర్శా ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన భార్యపై హత్యాయత్నం కింద కేసును నమోదు చేసిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : inebriated woman  business man  shoot  husband  bengaluru  hosur road  crime  

Other Articles