సుమారు ఐదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ నడివీధుల్లో అర్థరాత్రి జరిగిన పైశాచిక క్రీడ గుర్తే ఉండి ఉంటుంది. 23 సంవత్సరాల ఓ పారామెడికల్ విద్యార్థిని బస్సులో దారుణంగా అత్యాచారం చేసి ఆపై నడిరోడ్డుపై నగ్నంగా పడేసి ఆమె మరణానికి కారకులయ్యాయి నాలుగు మృగాలు. దేశం యువత మొత్తం ఒకేతాటిపైకి వచ్చి చేసిన పోరాటంతో చివరకు స్పందించిన కేంద్రం ఎట్టకేలకు వారిని కటకటాల వెనక్కి నెట్టడమే కాదు, కఠిన చట్టాలు రూపొందించేలా అడుగులు వేసింది.
'నిర్భయ' చట్టం ఆవిష్కరణకు నాంది పలికిన ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెలువరించనుంది. డిసెంబర్ 16, 2012న అక్షయ్ థాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ లు బస్సులో ఓ యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ట్రయల్ కోర్టు 2013లో మరణశిక్ష విధించగా, నిందితుల పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా, రామ్ సింగ్, తీహార్ జైల్లో మార్చి 2013లో ఉరివేసుకుని మరణించాడు.
మరో నిందితుడు నేరం చేసే సమయానికి మైనర్ కావడంతో, మూడేళ్ల శిక్షాకాలం తరువాత డిసెంబర్ 2015లో విడుదలయ్యాడు. నిర్బయ కేసు వెలుగులోకి వచ్చిన తరువాతనే, తీవ్రమైన నేరాల విషయంలో బాలనేరస్తుల వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తూ కూడా చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. ఇక ఈ కేసులో జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం నేడు తుది తీర్పును ఇవ్వనుంది. ఒకవేళ కోర్టు ఉరిని ఖరారు చేస్తే మాత్రం వాళ్లకు మిగిలేది రాష్ట్రపతి క్షమాభిక్ష మాత్రమే. ఉరి శిక్ష లేక జీవిత ఖైదా? అన్నది మధ్యాహ్నానికే తేలిపోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more