పంజాబ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందకు నడుంచుట్టిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆయనను హతమారుస్తామని బహిరంగంగా హెచ్చరికలు పంపుతున్నారు. కెనడాలో అశ్రయంపోందుతున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు అక్కడి నుంచే అమరీందర్ సింగ్ ను చంపుతామంటూ బెదిరింపు మెసేజ్ లను వరుసపెట్టి పంజాబ్ కు పంపుతున్నారు. "కెప్టెన్! అమరీందర్ సింగ్ గుర్తుపెట్టుకోండీ.. మీ పార్టీకి చెందిన మాజీ సీఎం మాదిరిగానే మిమల్నీ చంపుతాం’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ ను కారు బాంబు అమర్చి చంపడంతో ఖలిస్తాన్ ఉగ్రవాదులు అప్పట్లో ఉనికి చాటుకున్నారు. అయితే తాజాగా అమరీందర్ విషయంలోనూ అదే రిపీట్ వుతుందని.. అతని మాదిరిగానే అంత్యక్రియలను నిర్వహించుకోవడానికి మృతదేహం ముక్కలను ఏరుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా వరసపెట్టి వస్తున్న అడియో మెసేజ్ లను కెప్టన్ అమరీందర్ చాలా లైట్ గా తీసుకుంటున్నారు.
కాగా పంజాబ్ కు చెందిన వ్యక్తి కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్.. స్వదేశ పర్యటనకు రాగా, అతనితో అమరీందర్ కలవాల్సి వుంది. అయితే అతను కూడా ఖలిస్తాన్ ఉగ్రవాద అనుకూల వ్యక్తేనని భావించిన అమరీందర్ అతనితో భేటీకి విముఖత వ్యక్తం చేశారు. దీంతో తమ రక్షణ మంత్రిని కూడా ఉగ్రవాది అని వ్యాఖ్యానించిన మీకు నిజంగా దమ్ముంటే కెనడా రావాలని హెచ్చరించారు. కెనడా నుంచే మీకు సవాల్ విసురుతున్నా దమ్ముంటే రండీ చూసుకుందామని ఉగ్రవాదులు మేసేజ్ లు పంపారు.
‘‘మీరు కెనడాలోని సిక్కులందరినీ ఉగ్రవాదులని అంటున్నారు. మీరు రెచ్చగోట్టే చర్యలు మానుకోండి’’ అని కూడా మెసేజ్ లో పేర్కొన్నారు. పంజాబ్ తల్లులు దిలావర్ సింగ్ లాంటి బిడ్డలకు జన్మనివ్వడం అపలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పంజాబ్ లో అనేక మంది దిలావర్ సింగ్ లు వున్నారని పేర్కొన్నారు. దిలావర్ సింగ్.. మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కారులో బాంబును అమర్చి దానిని పెల్చి అతని హత్యకు కారకుడైన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి అమరీందర్ తో పాటు రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసిన మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ నూ కూడా వారు లక్ష్యంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు తాజాగా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఉగ్రవాదుల హెచ్చరికలను తాను లక్ష్యపెట్టబోనని అమరీందర్ స్పష్టం చేశారు. కెనడాలో వారు తలలు బద్దలుగొట్టుకుని అరచినా, ఇసుమంతయినా తాను చలించబోనని, రాష్ట్ర అభివృద్ధి పైనే తన దృష్టి మొత్తం కేంద్రీకృతమై వుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more