మొబైల్ ఫోన్.. ప్రతి ఒక్కరి చేతిలో ఇది ఇప్పుడు తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అంతేకాదు ఆపదలో వున్నవారికి అదే సాయాన్ని అందించే అస్త్రం. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు దీని అవసరం అధికం. కానీ అలాంటి ఫోన్ అమ్మాయిలు వాడకూడదట. అమ్మాయిలు సెల్ఫోన్ ఉపయోగించకూడదని, ముఖానికి స్కార్ఫ్లు కట్టుకోకూడదని ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ మేయర్ శకుంతల భారతి, ఎమ్మెల్యే సంజీవ్ రాజా క్రితం రోజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపితున్న క్రమంలోనే.. అమ్మాయిలు మొబైల్ ఫోన్స్ వాడుతూ.. వీధిలో నడిస్తే భారీ జరిమానా విధిస్తామని ఏకంగా గ్రామపంచాయితీ పెద్దలు ప్రకటించారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని మదుర జిల్లాలోని మడోర గ్రామ పంచాయతీ పెద్దలు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్క అమ్మాయిల ఫోన్ల వాడకంపైనే కాక, గోవులను చంపే వారిపై కూడా భారీ జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఆవులను చంపేవారికి వ్యతిరేకంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ కు ఎన్నికైన కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రచారాన్నిసపోర్టు చేయాలని ముస్లిం కమ్యూనిటీ నిర్ణయించడంతో, గ్రామ మాజీ ప్రధాన్ మహమ్మద్ గఫ్ఫర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆవులను దొంగలించేవారిపై లేదా చంపేవారిపై 2 లక్షలు, అదేవిధంగా మద్యం అమ్మేవారిపై రూ.1.11 లక్షలు , మొబైల్ ఫోన్లు వాడుతూ రోడ్లపై వీధుల్లో నడిచే అమ్మాయిలపై రూ.21వేల రూపాయలు జరిమానా విధించాలని పంచాయతీ సభ్యులు నిర్ణయించారు. అమ్మాయిలపై జరుగుతున్న క్రైమ్ కేసులను తగ్గించడానికి ఈ మేరకు జరిమానా విధించనున్నామని పంచాయతీ చెబుతోంది. పెనాల్టీతో పాటు ఏ మేరకు శిక్ష విధించాలో కూడా పంచాయతీ అంతా ఓ సారి నిర్ణయించనున్నారు.
అయితే భారతావనిలో భాగమైన ఈ గ్రామానికి ఇండియన్ పీనల్ కోడ్ వర్తించదా..? పురుషాధిక్య సమాజంలో అనాదిగా అమ్మాయిలు, మహిళలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఈ పెనాల్టీల గురించి తెలిసిన నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు. అకాశంలో సగం అంటూ అన్నింటా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలు, అమ్మాయిలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు, జాతీయ మహిళా కమీషన్ కూడా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more