ఆటోవాలాలపై అనేక జోకులున్నాయి. నగరానికి కొత్తగా వచ్చే ప్రయణాకులను అటోవాలాలు బోల్తా కోట్టించి ఏకంగా పెద్ద మొత్తంలో డబ్బుల వసూలు చేస్తారని కూడా సినిమాల్లో జోకులు పేలుతుంటాయి. అదే సమయంలో తమ నిజాయితీని కూడా నిరూపించుకున్న అటడ్రైవర్ల సంఖ్య కూడా తక్కువేం లేదు. అనేక మంది ప్రయాణికులు తమ వస్తువులను అటోలలో మర్చిపోయి వెళ్లినా వాటిని అంతే సురక్షితంగా పోలీసులకు అప్పగించిన వారికి కొదవ లేదు. అలాంటి వారి జాబితోలోకి మరో అటోడ్రైవర్ కూడా చేరిపోయారు.
ఓ ప్రయాణికురాలి తన అటోలో పోటోగ్గుకున్న ఐదు తులాల బంగారు గొలుసును తన చేతుల మీదుగానే అమెకు అప్పగించాడు అటోడ్రైవర్. అయితే ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించారు పోలీసులు. ఇందుకు కారణం అటో డ్రైవర్ నిజాయితీనే. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని అల్మాస్గూడకు చెందిన ఎం.ప్రియాంక (28) సైదాబాద్ వెళ్లేందుకు మల్లేశ్ ఆటో ఎక్కి మల్లమ్మ చౌరస్తా వద్ద దిగింది. అక్కడి నుంచి మరో ఆటోలో సైదాబాద్ వెళ్లింది. సైదాబాద్ చేరుకున్నాక తన మెడలోని గొలుసు కనిపంచకపోవడంతో.. ప్రియాంక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, ఆటో శుభ్రం చేస్తున్న మల్లేశ్కు సీటులో ఇరుక్కుపోయిన ఐదు తులాల బంగారు గొలుసు కనిపించింది. దీంతో ఆయన దానిని తీసుకెళ్లి మీర్పేట పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. అప్పటికే గొలుసు పోయిన ఫిర్యాదు ఉండడంతో ఎస్సై లక్ష్మణ్రెడ్డి ప్రియాంకను పిలిపించారు. స్టేషన్కు వచ్చిన ఆమెను గుర్తుపట్టిన మల్లేశ్.. అమెదే ఈ గోలుసని భావించాడు, అయితే మల్లేష్ నిజాయితీని అభినందించిన పోలీసులు ఆయన చేతుల మీదుగా ఆ గొలుసును ప్రియాంకకు అందజేశారు.
తాను నిత్యం కష్టపడి అటో నడుపుతానని, అయినా నెలకు కొద్దిగానే మిగులుతుందని, ఈ నేపథ్యంలో తన పిల్లలను చదివించడం, ఇత్యాది ఖర్చులకే సరిపోతుందని మల్లేష్ తెలిపాడు. అయితే ఎంతగా కష్టపడి తమ కూతుళ్లకు తల్లిదండ్రులు బంగారు అభరణాలు చేయిస్తారో తనకు అర్థమవుతుందని చెప్పారు. బాధితురాలికి దానిని తిరిగి ఇస్తే తాను పొందిన ఆనందానికి అవధులు లేవని తెలిపారు. కాగా, పోయిందనుకున్న తన బంగారు గొలుసు దొరికిన ఆనందంలో వున్న ప్రియాంక.. ఆటో డ్రైవర్ మల్లేశ్కు రూ.3 వేలు బహుమానంగా ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more