దేవుడి సొంత రాష్ట్రంగా, దైవపాలన సాగే ప్రాంతంగా, ప్రకృతి రమణీయతకు పేరొందిన భూభాగంగా ప్రసిద్ది చెందిన కేరళలలో.. రాబోయే తరంలో చిన్నారి తల్లులు, చిట్టి చిట్టి తండ్రుల సంఖ్య అధికమవుతూ.. ఈ తరహా వార్తలకు కూడా ప్రసిద్ది చెందే స్థాయికి దిగజారుతుందా అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కొచ్చి జిల్లాలోని ఎర్నాకులంలో పదహారేళ్ల బాలిక ఓ బిడ్డను ప్రసవించగా, నాలుగేళ్ల తక్కువ వయస్సున్న 12 బాలుడు ఆ బిడ్డకు తండ్రని అమె పర్కోన్నడంతో రేగిన సంచలనాన్ని మరువక ముందే మరోమారు అలాంటి ఘటనే కొల్లాం జిల్లాలో చేటుచేసుకోవడంతో ఇలాంటి అనుమానాలకు తావిస్తుంది.
తాజాగా తొమ్మిదో తరగతి చదువుతున్న పదిహేనేళ్ల బాలిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక బిడ్డకు పొరుగనుండే పదమూడేళ్ల మైనర్ బాలుడే తండ్రిని.. అతని కారణంగానే తాను తల్లినయ్యానని బాధితురాలు పేర్కోనడంతో.. అమె తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో నివ్వెరపోయిన పోలీసులు కొల్లం జిల్లాలోని పాతనాపురానికి చెందిన 13 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసిన న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. జువనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న న్యాయమూర్తి ఆ బాలుడికి బెయిల్ మంజూరు చేశారు.
వివరాల్లోకి వెళ్తే కొల్లం జిల్లా పాతనపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండగా ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాలికను పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నెలలు నిండిన కారణంగానే నొప్పులు వస్తున్నాయని చెప్పారు. ప్రసవం కోసం మంచి అస్పత్రికి తరలించాలని కూడా సూచించారురు. దీంతో మనోవేధన చెందిన బాలిక తల్లిదండ్రులు బాలికను ఇంట్లోనే ఉంచగా, ఇంట్లోనే బాలిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, తల్లిదండ్రులు నిలదీయడంతో.. తాను తల్లి కావడానికి కారణం తమ ఇంటి పొరుగున ఉన్న 13 ఏళ్ల బాలుడని చెప్పింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మప్టీలో నిందితుడైన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ఈ విషయమై ప్రశ్నించాగా..తాను కొన్నిసార్లు బాలికతో సెక్స్ లో పాల్గొన్నానని 8వతరగతి చదువుతున్న మైనర్ బాలుడు అంగీకరించాడు. పోలీసులు నిందితుడైన బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ బాలుడికి బెయిలు మంజూరు చేశారు. బిడ్డకు తండ్రి ఎవరో గుర్తించేందుకు బాలుడి తల్లిదండ్రుల అంగీకారంతో అతని రక్తనమూనాను సేకరించి డీఎన్ఏ పరీక్ష కోసం పంపించారు. బాధిత బాలిక, నిందితుడూ ఇద్దరూ మైనర్లు కావడంతో తాము ఈ కేసు విషయంలో న్యాయసలహా తీసుకుంటామని పతానాపురం సిఐ నందకుమార్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more