తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇక లేరు. సోమవారం ఉదయం గుండె పోటుతో ఆయన మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వేకువ ఝామున ఛాతీలో నొప్పి రావటంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించగా, ఉదయం 5.20కి తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టు సమాచారం.
నెహ్రూ అసలు పేరు రాజశేఖర్. 1954 జూన్ 22న విజయవాడలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు రామకృష్ణ వర ప్రసాద్. రాజకీయాల్లోకి రాక ముందు నెహ్రూ వ్యవసాయం చేసేవాడు. కాగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా(కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, తూర్పు నియోజకవర్గం నుంచి ఓ సారి) గెలుపొందిన ఎన్టీఆర్ హయాంలో 1994 నుంచి 1996 వరకు నెహ్రూ మంత్రిగా పనిచేశారు. బెజవాడ రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ తరఫున టిడిపి నేత గద్దె రామ్మోహన రావుపై పోటీ చేసి గెలిచారు.
కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబట్టింది లేదు. కానీ రాజకీయాల్లో ఉండాలంటే ఏదో పార్టీ ఉండాలి కాబట్టి అలాగే ఉండిపోయారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చివరకు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి సొంత గూటికి చేరిపోయారు. నెహ్రూ భార్య పేరు లక్ష్మీ. కొడుకు, కూతురు ఉన్నారు. అనారోగ్యం కారణంగా దేవినేని నెహ్రూ తన కొడుకు అవినాష్ ను రాజకీయాల్లోకి ప్రధానంగా తెరపైకి తీసుకు వచ్చారు.
సోదరుడి మృతి వార్త తెలుసుకున్న ఏపీ మంత్రి దేవినేని ఉమా, కుటుంబ సభ్యులు హైదరాబాద్ కి బయలు దేరారు. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నెహ్రూ మృతదేహాన్ని విజయవాడకు తరలించనున్నట్లు బంధువులు వెల్లడించారు. ఇక నెహ్రూ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ కొడెల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా లోటని చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more