పోలెండ్ లో ఓ భారతీయ విద్యార్థిపై దాడి, చనిపోయాడన్న వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాడు. పోజ్నన్ నగరంలోని ఓ ట్రామ్ వాహనంలో గుర్తు తెలియని దుండగుడు భారతీయ విద్యార్థిపై దాడి చేయటం పెద్ద కలకలమే రేపింది. అయితే తీవ్ర గాయాలపాలైన అతగాడు చనిపోయాడంటూ లోకల్ మీడియా కథనాలు ప్రసారం చేయటంతో మన మీడియా కూడా అదే ఫాలో అయ్యింది.
సమయానికి వైద్యం అందించటంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్ దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో స్పందించిన ఆమె పోలండ్లోని భారత రాయబారి నుంచి నివేదిక కోరింది. అయితే దాడి జరిగిన వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించటంతో ప్రాణాలతో బయటపడ్డాడంట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ లో పేర్కొంది. ఇక పోలెండ్ లోని భారత రాయబారి అజయ్ బిసారియా దాడిపై కూడా అదే విషయాన్ని ధృవీకరించాడు. ఇది వ్యక్తిగత దాడా? లేక జాతి వివక్షత దాడా? అన్నది ఇప్పుడే తేల్చలేమని, విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపాడు.
మరోవైపు అమెరికాలోని ఇండియానాలో మోన్రో ఆస్పత్రిలో పనిచేస్తున్న సిక్కు వైద్యుడు డాక్టర్ అమన్దీప్ సింగ్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. వివిధ మతాలకు చెందిన వారిని గతంలోనూ చంపానని ఆగంతుకుడు ఆ మెసేజ్లో పేర్కొనటంతో పోలీసులు అప్రమత్తం అయ్యాడు.
There was an incident of beating. Fortunately, he has survived. We are inquiring into all aspects of the incident. https://t.co/uO9hJ171aB
— Sushma Swaraj (@SushmaSwaraj) March 31, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more